- అన్ని వ్యాపార సంస్థల్లోనూ పీఓఎస్ యంత్రాలు
- కలెక్టర్ కోన శశిధర్
అనంతపురం అర్బన్ : వ్యాపార లావాదేవీల్లో నగదుకు బదులుగా డెబిట్(ఏటీఎం) కార్డు వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాల్లోనూ పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. డెబిట్ కార్డు వినియోగంపై అదనపు ఛార్జీలు ఉండవన్న ఆయన పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తున్నామన్నారు. అన్ని రకాల వ్యాపార లావాదేవీలకూ డెబిట్ కార్డు వినియోగించేలా ప్రజలను చైతన్యం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లోని రెవిన్యూ భవన్లో గురువారం ఆయన జేసీ బి.లక్ష్మికాంతం, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో రూ.90 కోట్లు నగదు మార్పిడి జరిగిందని, రూ.430 కోట్లు విత్డ్రా చేసుకున్నారని, రూ.1,360 కోట్లు డిపాజిట్ చేశారని తెలిపారు. జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి 556 ఏటీఎంలు ఉంటే ఇప్పటివరకు 300 ఏటీఎంలను వినియోగంలోకి తెచ్చామన్నారు. రెండు మూడు రోజుల్లో అన్నీ పని చేస్తాయని చెప్పారు. 5.73 లక్షల జన్ధన్ ఖాతాలున్నాయని, వారిలో డెబిట్ కార్డులు లేని వాళ్లందరికీ బ్యాంకర్లు మూడురోజుల్లో ఇస్తారని చెప్పారు.
డెబిట్ కార్డుల వల్ల చాలా వెసులుబాటు ఉంటుందని, పైగా భవిష్యత్తులో నోట్లు రద్దయినా ఎలాంటి ఇబ్బందీ తలెత్తదనీ అన్నారు. అందువల్ల ప్రజలంతా డెబిట్ కార్డుల ద్వారానే వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. అంతకు ముందు అన్ని వ్యాపార వర్గాల సంఘాల ప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ పీఓఎస్ యంత్రాల వినియోగం ఆవశ్యకతను వారికి తెలియజేశారు. ప్రతి లావాదేవీ డెబిట్ కార్డు ద్వారా సాగితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, ఈ చర్యలకు వ్యాపార వర్గాలు సహకరించాలని కోరారు.
కార్డు లావాదేవీల పెంపు
Published Fri, Nov 18 2016 1:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement