► నేటి నుంచి నోట్ల మార్పిడి రూ.2 వేలకు పరిమితం
►మరింత తీవ్రం కానున్న కరెన్సీ కష్టాలు
► స్వైప్ మెషీన్ల వినియోగంపై ప్రత్యేక దృష్టి
►సహకార బ్యాంకులకు నగదు
►నిలిపివేతపై డీసీసీబీ ఉద్యోగుల ఆగ్రహం
►నేటి నుంచి దశలవారీగా
►ఉద్యమానికి పిలుపు ఆర్టీసీ టోల్ వసూలుపై ప్రజానీకం మండిపాటు
క్రితం దానిని మరో రూ.500కు పెంచింది. దీంతో రూ.4,500 వస్తాయని భావించి బ్యాంకుకు వెళ్లిన ప్రజానీకానికి రూ.4వేలు మాత్రమే అందుతూ వచ్చాయి. తాజాగా ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ మొత్తాన్ని రెండువేలకు పరిమితం చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. దీంతో శుక్రవారం బ్యాంకుల వద్దకు వెళదామని బావించిన ఖాతాదారులు కూడా బ్యాంకుల వద్దకు పరుగుపెట్టారు. ధాన్యం విక్రయించిన రైతులకు నగదును ఆన్లైన్ ద్వారా పంపాలని, ఇదే క్రమంలో రైతులు తమ ఖాతాలనుంచి వారంలో రు.25వేల వరకు డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం వెలువడింది. కల్యాణాలకు సంబంధించి రూ.2.5 లక్షల వరకు డ్రా చేసుకునేందుకు రిజర్వుబ్యాంకు సడలింపు ఇచ్చింది. చివరకు నగదు కొరత పిల్లల పుట్టినరోజు వేడుకలపై కూడా పడింది. చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి కొనేందుకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. బ్యాంకర్లతోపాటు వర్తకులు కూడా స్వైపింగ్ మెషీన్ల వినియోగం, విస్తరణపై దృష్టిపెట్టాలని అధికారులు పేర్కొంటున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రైతు బజార్లలో బ్యాంకులు స్వైపింగ్ మెషీన్లను ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
నేటి నుంచి సహకార బ్యాంకు ఉద్యోగుల ఆందోళన ..
సహకార బ్యాంకులకు నగదు లావాదేవీలను నిలిపివేస్తూ రిజర్వుబ్యాంకు నిర్ణయం తీసుకోవడంపై సహకార బ్యాంకు ఉద్యోగస్తులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ చర్యవల్ల సహకార బ్యాంకులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాయని, రైతాంగానికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవి మురళీప్రసాద్ తెలిపారు. ఆర్బీఐ, కేంద్రప్రభుత్వ చర్యలు చివరకు డీసీసీబీల మనుగడకే ప్రమాదంగా మారనున్నాయన్నారు. ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్స ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపుమేరకు ఈనెల 18న జిల్లా కేంద్రసహకార బ్యాంకు బ్రాంచీల ముందు మద్యాహ్న భోజన విరామసమయంలో ఆందోళన కార్యక్రమాలు, 22వ తేదీ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా, 25వ తేదీ డీసీసీబీ ఉద్యోగులందరూ ఒకరోజు సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు.
ఆర్టీసీపై ప్రజాగ్రహం..
ఆర్టీసీ అధికారులు ఫ్లెక్సీ ఫేర్ పేరుతో రోజుకో రేటు చొప్పున టిక్కెట్ల రేట్లను నిర్ణయిస్తుంది. కానీ ఈనెల 10వ తేదీ నుంచి టోల్గేట్ల వద్ద టోల్ట్యాక్స్ను కేంద్రప్రభుత్వం తాత్కాలికంగా రద్దుచేసింది. దీని ప్రకారం టోల్ఫీజును కూడా ఆర్టీసీ ప్రయాణికుని నుంచి వసూలు చేయడం మానుకోవాలి. కానీ వసూలుచేస్తూనే ఉందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వెళ్లాలంటే రెండు టోల్గేట్లు, తిరుపతికి మూడు టోల్గేట్ల ప్రకారం ఫీజులు వసూలుచేస్తున్నార ని, ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు ఈనెల 24వరకు టోల్ ఫీజులు వసూలుచేయరాదని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ ఆర్ఎం ఆదంసాహెబ్ వివరణ ఇస్తూ టోల్గేటు ఫీజును నెల మొత్తానికి కలిపి ఆర్టీసీ ముందుగానే చెల్లిస్తుందని, అందువల్ళే వసూలు చేస్తున్నామని చెప్పారు.
నగదు మార్పిడిపై కొరడా
Published Fri, Nov 18 2016 3:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement