ఇచ్ఛాపురం రూరల్ : కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే దక్షిణ భారత రాష్ట్రాల్లో రవాణా రంగం నష్టాల్లో ఉందని జిల్లా లారీ యజమానుల జేఏసీ కన్వీనర్, ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాల లారీల నిరవధిక బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి ధనరాజులమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఇచ్ఛాపురం బోర్డర్ లారీ ఓనర్స్ అసోసియేషన్(ఐబీఎల్ఓఏ)ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర లారీ యజమానుల సంఘ అధ్యక్షుడు ముడియా జానకిరామ్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన థర్డ్ పార్టీ ప్రీమియం తగ్గించాలని, రవాణా వాహనాలకు స్పీడ్ గవర్నర్ ఏర్పాటును ఉపసంహరించాలని, పెంచిన ఆర్టిఎ చలానా ఫీజులు, పెనాల్టీలను రద్దు చేయాలని, టోల్ ఫీ రద్దు చేయాలని, ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా ఏసీ క్యాబిన్ ట్రక్కుల సరఫరా ఆదేశాలను ఉపసంహరించాలని, 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను నిలుపుదల చేసే ఆలోచన విరమించుకోవాలని, ఆంధ్రా, తెలంగాణాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీఐ ఎం.అవతారం, రూరల్ ఎస్సై మీసాల చిన్నంనాయుడులు సిబ్బందితో చేరుకుని సంఘ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం పరిస్థితిని చక్కదిద్దారు. నిరసన కార్యక్రమంలో ఇచ్ఛాపురం బోర్డర్ లారీ అసోషియేషన్ లీగల్ అడ్వయిజర్ జీరు కామేష్రెడ్డి, ఉపాధ్యక్షుడు పితంబర్ మహంతి, కార్యదర్శి ఉలాసి శ్యాంకుమార్ రెడ్డి, కోశాధికారి మద్ది రాంబాబు, సభ్యులు నందిక ప్రేమ్కుమార్, ఉలాసి ఉమాపతి, బృందావన్ మహంతి, సునీల్ మహంతిలు పాల్గొన్నారు. వీరికి ఆటోయూనియన్ అధ్యక్షుడు ఉలాసి యర్రయ్య, ట్రాక్టర్ అసోషియేషన్ అధ్యక్షుడు గుజ్జు జగన్నాథంరెడ్డి, ఉప్పాడ చినబాబురెడ్డిలు మద్దతు పలికారు.
రవాణా రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
Published Fri, Mar 31 2017 3:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మేం ఓటేశాం
ప్రమాదంలో ముస్లిం సమాజం
టీడీపీ మేనిఫెస్టోను కాపులు విశ్వసించటం లేదు
టిఫిన్ కోసం పిడిగుద్దులు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నిర్భయంగా ఓటు హక్కు వినియోగం
కౌంటింగ్, స్ట్రాంగ్ రూములు పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు
ఆంధ్రాకు ఏం చేశారని వస్తున్నారు మోదీజీ?
తప్పక చదవండి
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
Advertisement