సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభం

Published Fri, Nov 4 2016 1:05 AM

సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభం

కావలి : పట్టణంలోని ఉదయగిరి రోడ్డుపై ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ను మంత్రి పి.నారాయణ గురువారం రాత్రి  ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత 6వ వార్డులో సిమెంటు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. బాలికల హాస్టల్‌ భవనాల ప్రారంభం ఆలస్యంగా జరిగింది. రెడ్‌క్రాస్‌ భవనంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నేమాల సుకుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కనమర్లపూడి వెంకటనారాయణ, రాష్ట్ర సేవాదళ్‌ సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, జిల్లా జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు, కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement