సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న డీఎస్సీ అభ్యర్థులు | Sakshi
Sakshi News home page

సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న డీఎస్సీ అభ్యర్థులు

Published Wed, Sep 30 2015 6:08 PM

సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న డీఎస్సీ అభ్యర్థులు - Sakshi

అనంతపురం: అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. డీఎస్సీ అభ్యర్థులు బుధవారం సీఎం ప్రసంగానికి పలుమార్లు వారు అడ్డుతగిలారు. ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభ్యర్థులు ఇలా గొడవ చేస్తే మీ సమస్యలు పరిష్కరించనంటూ సీఎం వారిని హెచ్చరించడం గమనార్హం. ఏపీలో 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య విభేదాలకు చాలామంది ప్రయత్నిస్తున్నారంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆరోపించారు. విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. నూతన రాజధాని అమరావతిలో 186 కి.మీ రింగ్ రోడ్డుకు కేంద్ర సానుకూలమేనని తెలిపారు. ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం ఆలోచిస్తుందని వెంకయ్య ప్రస్తావించారు.

Advertisement
Advertisement