♦ ధ్వజమెత్తిన అంబటి రాంబాబు
♦ ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు
♦ వెంకయ్యనాయుడు మధ్యవర్తిత్వం... కేసీఆర్ షరతులు
♦ అందుకే మూడు నెలలుగా హైదరాబాద్లో అడుగుపెట్టలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వద్ద కండిషనల్ బెయిల్ తీసుకుని 88 రోజుల తరువాత ఉమ్మడి రాజధానిలోని సచివాలయంలో అడుగుపెట్టిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడి ్డని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం లో స్వర సహితంగా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ తరువాత హైదరాబాద్ వైపు చూడ్డం మానేశారన్నారు.
చంద్రబాబు సచివాలయంలోని తన చాంబర్కు రూ.25 కోట్లు, హెచ్ బ్లాక్కు రూ.10 కోట్లు, లేక్వ్యూ అతిథి గృహానికి (క్యాంపు కార్యాలయం) రూ. 10 కోట్లు... మొత్తం రూ. 45 కో ట్లు వ్యయం చేసి ఇక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసుకుని 88 రోజుల పాటు ఇక్కడికి రాకుండా ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. విభజన బిల్లు ప్రకారం పదేళ్ల పాటు ఇక్కడ ఉండే అవకాశం ఉన్నా ఇక్కడ ఉండరని ఏపీ ముఖ్యమంత్రి తరపున కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కేసీఆర్ కు పూచీకత్తు ఇచ్చారని, ఆయన మధ్యవర్తిత్వంలోనే వీరిద్దరి మధ్య ఈ షరతు మేరకు అంగీకారం కుదిరిందని చెప్పారు. ఈరోజు చంద్రబాబు సచివాలయానికి వచ్చారంటే అది కేసీఆర్ అనుమతితోనే అని ఎద్దేవా చేశారు. ఈ విధంగా కేసీఆర్ వద్ద కండిషనల్ బెయిల్ తీసుకుని పాలిస్తున్న చంద్రబాబుకు జగన్ను విమర్శించే నైతిక హక్కుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్వాడీలపై అణచివేత పాశవికం
చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 23 నుం చి జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద అంగన్వాడీ టీచర్లు చేస్తున్న ఆందోళనను పాశవికంగా అణచివేయడం దారుణమని అంబటి విమర్శించారు.
చంద్రబాబుకు అంబటి సూటి ప్రశ్నలు
రాజకీయనేతలు పత్రికలు, టీవీ చానెళ్లు పెట్టకూడదని ధర్మ పన్నాలు వల్లిస్తున్న చంద్రబాబూ... మీ పార్టీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి టీవీ చానెల్ను నడపడం లేదా? మీ కుమారుడు లోకేశ్ బాబుతో ‘స్టూడియో-ఎన్’లో పెట్టుబడులు పెట్టించి నిర్వహణ చేయించింది తెలియదనుకుంటున్నారా? లోకేశ్ నిర్దేశకత్వంలో ఆ చానెల్ చూసేవాడే దిక్కులేకపోతే ఆ యాజమాన్యం ఆయన్ను బయటకు పంపించిన విషయం తెలియదా? సైకిల్పై తిరిగే ఒక వ్యక్తి పత్రికలో వేల కోట్లు బినామీగా పెట్టుబడులు పెట్టి నడిపించడం లేదా?
మీకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు చదవొద్దని, చానెళ్లను చూడద్దని చెప్పడానికి మీకేం హక్కుంది?
మీకు వ్యతిరేకంగా ప్రసారాలు చేస్తున్నారని ఎన్టీవీ ప్రసారాలను 13 జిల్లాల్లో నిలిపివేయించింది వాస్తవం కాదా?
కండిషనల్ బెయిల్పై చంద్రబాబు!
Published Sun, Nov 29 2015 3:30 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement