ప్రేమ పేరుతో మోసం... యువకుడిపై కేసు | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో మోసం... యువకుడిపై కేసు

Published Wed, May 11 2016 8:52 PM

ప్రేమ పేరుతో మోసం... యువకుడిపై కేసు - Sakshi

మేడ్చల్: ప్రేమ పేరుతో ఓ యువతికి దగ్గరై.. తర్వాత పెళ్లి చేసుకుని పరారైన యువకుడిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నాగులూరు గ్రామానికి చెందిన ఓ యువతి(24) రెండేళ్ల క్రితం మేడ్చల్ పట్టణంలోని ఓ దుస్తుల దుకాణంలో పని చేస్తుండగా... ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతానికి చెందిన చింతల సాగర్(26)తో పరిచయం ఏర్పడింది. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సాగర్ యువతిని గర్భవతిని చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా తనకు సంబంధం లేదని, కులం పేరుతో దూషించి అవమానించాడు.

దీంతో కేసు పెడతానని యువతి అనడంతో సాగర్ గత నెల 7న నగరంలోని జీడిమెట్ల ఆర్య సమాజ్‌లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం విజయువాడలో ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసి వస్తానని చెప్పి వెళ్లిన సాగర్ తిరిగి రాలేదు. సాగర్ ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో... తనను మోసం చేసిన సాగర్‌పై చర్యలు తీసుకోవాలని యువతి మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిపై చీటింగ్, అట్రాసిటి కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

Advertisement
Advertisement