ధర్మవరం టౌన్: ధర్మవరం ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృత్యువుపాలైంది. పట్టణంలోని లోనికోటకు చెందిన హసీఫా శుక్రవారం ప్రభుత్వాస్పత్రిలో పండంటి మగబిడ్డను ప్రసవించింది. శిశువు ఉమ్మనీరు తాగడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో విషయాన్ని వైద్యులకు తెలిపారు. అయితే ఆ సమయంలో చిన్నపిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు అందుబాటులో లేరు. చేసేదిలేక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించుకుని తిరిగి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అప్పటికి చిన్నారి ఆరోగ్యం కుదుటపడినా శనివారం ఉదయం మళ్లీ క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో మరోసారి ఇబ్బంది ఎదురవడంతో చిన్నారి తల్లిదండ్రులు డ్యూటీ డాక్టర్ వెంకటేశ్వర్లు కోసం చిన్నపిల్లల వార్డుకు వెళితే యథావిధిగా అందుబాటులో లేడు.
దీంతో వారు ఆ చిన్నారిని తిరిగి అదే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని వైద్యుడు చెప్పడంతో రోదిస్తూ ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన చిన్నపిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంతోనే తమ పిల్లాడు మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆస్పత్రికి వచ్చిన వారి ప్రాణాలు తీస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వివాదం ముదరడంతో పట్టణ ఎస్సై జయానాయక్ అక్కడికి చేరుకుని బాధితులను శాంతపరిచారు. జరిగిన విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా.. సూపరింటెండెంట్ రామలక్ష్మి చిన్నపిల్లల డాక్టర్ సెలవులో ఉండటంతోనే బయట చికిత్స చేయించుకున్నారని వివరణ ఇచ్చారు. చిన్న పిల్లల డాక్టర్ వెంకటేశ్వర్లు మాత్రం తాను డ్యూటీలో ఉన్నానని, తన వద్దకు ఎవరూ రాలేదంటూ పొంతన లేని సమాధానం చెప్పారు.
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
Published Sat, Sep 9 2017 10:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement