రంజాన్‌ పండుగ వేళ విషాదం | Sakshi
Sakshi News home page

రంజాన్‌ పండుగ వేళ విషాదం

Published Tue, Jun 27 2017 10:40 PM

child dies of road accident

సోమందేపల్లి (పెనుకొండ) : రోడ్డు దాటుతున్న ఆరేళ్ల చిన్నారిని రోడ్డు ప్రమాదం కబళించింది. రంజాన్‌ పండుగ సంబరంలో మునిగిపోయిన కుటుంబంలో ఈ ఘటన విషాదం నింపింది. ఏఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌ తెలిపిన మేరకు.. హిందూపురంలోని హస్నాబాద్‌కు చెందిన వాజీద్ తన ఆరేళ్ల కుమారుడు అయాన్‌తో కలిసి మంగళవారం ద్విచక్రవాహనంలో పెనుకొండకు బయల్దేరాడు. మార్గం మధ్యలో సోమందేపల్లి మండలం చాలకూరు వద్ద కొద్దిసేపు ఆగాడు.

అక్కడ ఆడుకోవడానికి పక్కకు వెళ్లిన అయాన్‌ రోడ్డుదాటుతుండగా పెనుకొండ వైపు వస్తున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని హిందూపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. రంజాన్‌ పండుగ ముగియడంతో పెనుకొండ సమీపంలోని బాబయ్యస్వామి దర్గా, గొల్లపల్లి రిజర్వాయర్‌ సందర్శించడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement