దారుణం | Sakshi
Sakshi News home page

దారుణం

Published Tue, Sep 5 2017 11:02 PM

దారుణం - Sakshi

రోడ్డు పక్కన పసికందు మృతదేహం
శరీర భాగాలు పీక్కుతిన్న కుక్కలు
ఉరి వేసినట్లుగా మెడలో తాడు!


దారుణం జరిగిపోయింది. మాటల్లో చెప్పలేనంత దుర్ఘటన వెలుగు చూడడంతో ప్రజలు దిగ్ర్భాంతికి లోనయ్యారు. మూడు రోజుల పసికందు మృతదేహం.. ఎవరో కత్తిరించినట్లుగా రెండు చేతులూ భుజాల వరకూ లేవు! ఉరివేసినట్లుగా మెడలో తాడు!! ఏ తల్లి కన్న బిడ్డో తెలీదు కానీ చూసిన వారి హృదయాలు ‍ద్రవించిపోయాయి. అనంతపురంలోని జేఎన్‌టీయూ సమీపంలో మంగళవారం ఈ ఘటన కలకలం సృష్టించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటరమణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో రెండు రోజుల క్రితం జేఎన్‌టీయూ సమీపంలో పడి ఉన్న ఆడశిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమీపంలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు.  లోపం ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. పాతిపెట్టిన శిశువు మృతదేహాన్ని కుక్కలు వెలికి తీశాయి. రెండు చేతులూ పీక్కు తిన్నాయి. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని రోడ్డుపైకి లాక్కొచ్చాయి.

ఈ దృశ్యాన్ని చూసిన కొందరు కుక్కలను తరిమేసి, తిరిగి శిశువు మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించారు. అయితే మృతదేహాన్ని తాకలేని వారు తాడుతో లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే మెడకు తాడు వేశారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎస్‌ఐ, పోలీస్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా శిశువు రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు తేలిందని, పాతిపెట్టిన మృతదేహాన్ని కుక్కలు వెలికి తీశాయని ఎస్‌ఐ తెలిపారు.
- అనంతపురం సెంట్రల్‌:

Advertisement

తప్పక చదవండి

Advertisement