ధారూరు(రంగారెడ్డి): బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని అధికార యంత్రాంగం ఎన్ని విధాలుగా యత్నించినా విఫలమవుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఇది. పద్నాలుగేళ్ల బాలికకు పెద్దలు చేయతలపెట్టిన వివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన చాకలి అనంతయ్య, బాలమణి దంపతుల కూతురు (14)ను పెద్దెముల్ మండలం ఇందూరు గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడితో ఈనెల 24న వివాహం చేసేందుకు రెండు కుటుంబాల వారు నిర్ణయించారు. ఇందులో భాగంగానే బాలిక తల్లిదండ్రులు రూ.లక్ష కట్నం ఇవ్వటంతోపాటు మరో రూ.30 వేలతో దుస్తులు, రూ.20 వేలతో ఇంటి సామాను కొనుగోలు చేసి సిద్దంగా ఉంచారు.
ఇందుకోసం బాలిక తండ్రి అనంతయ్య ఎకరా పొలాన్ని విక్రయించి వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, 1098 చైల్డ్లైన్కు కొందరు వ్యక్తులు ఫోన్ చేసి బాల్య వివాహంపై సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన చైల్డ్లైన్ సభ్యులు, తహసీల్దార్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుశీలతో పాటు పోలీసులకు సమాచారం అందజేశారు. వారంతా బుధవారం బాలిక తల్లిదండ్రులను మండల రెవెనూ కార్యాలయానికి రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కట్నంగా ఇచ్చిన రూ.లక్ష తిరిగి బాలిక తల్లిదండ్రులకు ఇప్పించేందుకు అధికారులు ఒప్పించారు. బాలికను నగరంలోని నిబోలిఅడ్డ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ హోంకు తరలించారు.
బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
Published Wed, Apr 20 2016 4:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement