అటవీశాఖ అధికారిపై చింతమనేని చిందులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై తరచూ దాడులు, దూషణలకు దిగే ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈసారి అటవీ శాఖ అధికారిపై తన ప్రతాపం చూపించారు. తన మాటకు అడ్డొచ్చినందుకు ‘సెలవులోకి వెళ్లిపో. మీ ఇష్టమొచ్చినట్టు పనిచేస్తే కుదరదు. మేం చెప్పినట్టు చేయాలంతే...’అంటూ చిందులు తొక్కారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో శనివారం ఎంపీ మాగంటి బాబు అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. కొల్లేరు పరిధిలోని జిరాయితీ భూముల్లో చేపల పట్టుబడికి అనుమతి ఇవ్వాలని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కోరారు.
ఇందుకు చింతమనేని ప్రభాకర్ మద్దతు పలుకుతూ.. ‘అటవీ అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలి. కొల్లేరులో చేపల పట్టుబడికి అడ్డొస్తున్నారు. కేంద్రంలోను, రాష్ర్టంలోను మా ప్రభుత్వాలే ఉన్నాయి. మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే ఎలా..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఉన్న ఏలూరు ఇన్చార్జ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) పి.శివశంకర్రెడ్డి స్పందిస్తూ.. నిబంధనల ప్రకారం జిరాయితీ భూముల్లో చేపల చెరువులు నిషిద్ధమని, సంప్రదాయ సాగుకు అభ్యంతరం లేదు కానీ ఫిష్ ట్యాంకులు వేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన చింతమనేని ‘అయితే నువ్వు సెలవులోకి వెళ్లు. ఇంకోడు వస్తాడు’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు ప్రతిగా శివశంకర్రెడ్డి ‘నేను ఇప్పుడే సెలవు పెట్టేస్తా. శాంక్షన్ చేయించుకోండి’ అని సూటిగా బదులిచ్చారు.
ముందే సెలవుపెట్టాను : డీఎఫ్వో
‘జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చేపల చెరువుల చర్చ సందర్భంగా ప్రజాప్రతినిధులు మా శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రెండు నెలల కిందటే ఇన్చార్జిగా వచ్చాను. జిరాయితీ భూముల విషయంలో మేం నిబంధనల మేరకే నడుచుకుంటాం తప్ప ఎవరికీ వ్యతిరేకం కాదు.ఆరోగ్య కారణాల రీత్యా నేను ముందుగానే సెలవుపెట్టాను’ అని డీఎఫ్వో ‘సాక్షి’కి చెప్పారు.
సెలవుపై వెళ్లిపో..
Published Sun, Apr 17 2016 9:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement