కడప స్పోర్ట్స్ :
కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో సౌత్జోన్ అంతర్ జిల్లాల అండర్–16 మహిళా క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం కడప, చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 25 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. జట్టులోని ఎ. అఖిల 24 పరుగులు, కె. రేఖ 90 పరుగులతో అజేయంగా నిలిచారు. కడప బౌలర్లు ఓబులమ్మ 3 వికెట్లు తీసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 25 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులోని కె. ఓబులమ్మ 54 పరుగులు చేసింది. చిత్తూరు బౌలర్ రోషిణి 1 వికెట్ తీసింది. దీంతో చిత్తూరు జట్టు 97 పరుగుల తేడాతో విజయం సాధించి 4 పాయింట్లు సాధించింది.
అనంతపురంపై కర్నూలు విజయం..
మధ్యాహ్నం నిర్వహించిన మ్యాచ్లో కర్నూలు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. జట్టులోని ఎం. అనూష 60 పరుగులతో నాటౌట్గా నిలిచింది. శరణ్య 28 పరుగులు చేసింది. అనంతపురం బౌలర్లు మనీషా 1, అనూషా 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 25 ఓ వర్లలో 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులోని పి. మనీషా 19 పరుగులు చేసింది. కర్నూలు బౌలర్లు లక్ష్మి, సుప్రజ చెరో వికెట్ తీశారు. దీంతో కర్నూలు జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో కర్నూలు జట్టుకు 4 పాయింట్లు లభించాయి.