బొగ్గులారీ బోల్తా | Sakshi
Sakshi News home page

బొగ్గులారీ బోల్తా

Published Fri, Dec 9 2016 11:38 PM

Coal truck roll over

- డ్రైవర్‌ మృతి
 - ముగ్గురికి గాయాలు
 
బేతంచెర్ల: కర్నూలు రహదారిలోని సీతారామాపురం మెట్ట సమీపంలో గురువారం అర్ధరాత్రి బొగ్గులారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి చెందగా అందులోని ముగ్గురికి గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి తెలంగాణ రాష్ట్రం యాదగిరి గుట్ట సమీపంలోని సిమెంట్‌ ఫ్యాక్టరీకి బొగ్గు లోడుతో వెళ్తున్న  ఽలారీ సీతారామాపురం మెట్ట వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో వనపర్తి జిల్లా నార్వ మండలం చంద్ర గట్టు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ పరశురామ్‌ (24) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అదే లారీలోని డోన్‌కు చెందిన  వలసల రామకృష్ణ, బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామానికి చెందిన బాల చెన్నయ్య, చంద్రగట్టు గ్రామానికి చెందిన చెన్నారెడ్డి గాయాలతో బయట పడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం మెరుగైన  వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు.   
 

Advertisement
Advertisement