ఖోఖో జిల్లా జట్ల ఎంపిక | Sakshi
Sakshi News home page

ఖోఖో జిల్లా జట్ల ఎంపిక

Published Mon, Oct 17 2016 12:12 AM

ఖోఖో జిల్లా జట్ల ఎంపిక

భీమడోలు :  రాష్ట్రస్థాయి అండర్‌–18 ఖోఖో పోటీలకు ఆదివారం జిల్లా బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భీమడోలు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికైన జట్లు ఈనెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు భీమడోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాయి. తొలుత పోటీలను ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్సీ ఆర్‌.సూర్యారావు ప్రారంభించారు. ఎంపికైన జట్ల వివరాలను జిల్లా అసోయేషన్‌ చైర్మన్‌ ఎం.బాపినీడు, అధ్యక్షుడు ఇ.సాంబశివరావు, కార్యదర్శి ఎస్‌వీ రంగారావు ప్రకటించారు. 
బాలుర జట్టు 
ఎం.శ్రీనివాసరావు, కె.గంగాధర్, కె.సతీష్, డి.రాజ్‌కుమార్, ఆర్‌.సోమ సత్యసాయి, ఎం.పైడిరాజు, ఎం.ముత్యాల నాయుడు, కె.రమేష్, ఎ.రాజ్‌కుమార్, ఇ.వంశీ మురళీకృష్ణ, ఎన్‌.మహేష్‌బాబు, ఎల్‌.నారాయణ రావు, ఎల్‌.అప్పలనాయుడు, కె.ఉమా మహేశ్వరరావు, డి.నవీన్‌కుమార్‌ బాలుర జట్టుకు ఎంపికయ్యారు. 
బాలికల జట్టు 
జి.రాశి, జి.నవ్య, వి.ప్రభావతి, జి.కృపావతి, ఎం.విజయ శ్రీ, కె.సాయి స్వప్న, ఎం.హేమలత, కె.మౌనిక, ఎం.సుధారాణి, కె.శిరీషా, కె.లక్ష్మి, ఎం.లక్ష్మి, కె.ఉమా ఈశ్వరి, టి.నాగSతులసి, యు.మౌనిక బాలికల జట్టుకు ఎంపికయ్యారు. 
 
 

Advertisement
Advertisement