మూన్నెళ్లకోసారి ఇదే తంతు
తెర వెనుక విషయం వేరు
జనాన్ని నమ్మించేందుకే నాటకాలు
విశాఖపట్నం: ఖద్దరుతో ఖాకీ జత కట్టకపోతే జత కట్టేలా చేయడం ఖద్దరుకు అలవాటు.. ఖద్దరు ఏం చెబితే అదే చేసుకుపోవడం ఖాకీకి తప్పని గ్రహపాటు. ఈ రెండు వర్గాల మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూవుంటారు. జిల్లా ఎస్పీ, నగర పోలీస్ కమిషనర్ తమకు సహకరించడం లేదని ఓపక్క ప్రజాప్రతినిధులు రుసరుసలాడుతుంటారు. మరోపక్క తెర వెనుక ఒకరికొకరు సహకరించుకుంటూనే ఉంటారు. పోలీసు బదిలీలు, నియామకాల విషయంలో తమ మాట చెల్లలేదని ఎమ్మెల్యేలు గతంలో సీఎంకు ఫిర్యాదు చేశారు.
మంత్రి కల్పించుకొని పోలీసు ఉన్నతాధికారులకు క్లాస్ తీసుకోవడంతో సద్దుమణిగింది. ఇది జరిగి కొన్ని నెలలు గడిచిపోయింది. తాజాగా పోలీస్ కమిషనరేట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి సీఎం వస్తుంటే ఆ కార్యక్రమానికి తమకు ఆహ్వానం సరిగ్గా అందలేదంటూ కొందరు ఎమ్మెల్యేలు వివాదం లేవనెత్తారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్పుకొస్తున్నారు. మళ్లీ ఈ ట్విస్ట్ ఏమిటని ఆరా తీస్తే అసలు డ్రామా బయటపడింది. నాలుగు రోజుల క్రితం చిరు వ్యాపారుల మార్కెట్ను అధికారులు బలవంతంగా కూలగొట్టారు.
పోలీసులు అంత కఠినంగా వ్యవహరించడానికి కారణం ఓ ప్రజాప్రతినిధి. ఆయన పంతం పట్టి ఆ మార్కెట్లో జనాన్ని అక్కడి నుంచి తప్పించాల్సిందేనని, అంత వరకూ కదిలేది లేదని జీవీఎంసీ కమిషనర్ ఎదుట కూర్చున్నారట. కమిషనర్ చేసేది లేక సిటీ పోలీస్ కమిషనర్ సహాయాన్ని కోరారు. జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు, ఎమ్మెల్యే ఏకమై అలా మార్కెట్ను కూలగొట్టారు. అ విషయం బయటకు పొక్కడంతో అప్రతిష్ట పాలవుతామని గ్రహించిన ఆ ఎమ్మెల్యే మర్నాడు బాధితులను పరామర్శించి మొసలి కన్నీరు కార్చారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు, పోలీసులు చేసిన పనితో తమకు సంబంధం లేదని జనాన్ని నమ్మించేందుకే ఈ కమిషనరేట్ డ్రామా ఆడారని అంతా భావిస్తున్నారు. నిజానికి ఇటు నగరంలోనూ, అటు రూరల్లోనూ ప్రజాప్రతినిధులు చెప్పిందే పోలీస్ స్టేషన్లో నడుస్తోంది. దాని ఫలితంగానే ఎన్నడూ లేనంతగా హత్యలు, భూ కబ్జాలు, రౌడీయిజం పెచ్చుమీరుతున్నాయి. ఇది ఎంత దాచేసినా దాగని సత్యం.
ఖద్దరు, ఖాకీ మధ్య మళ్లీ వార్
Published Wed, May 4 2016 3:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement