‘ఉత్తమ’ గురువులకు కలెక్టర్‌ అభినందన | Sakshi
Sakshi News home page

‘ఉత్తమ’ గురువులకు కలెక్టర్‌ అభినందన

Published Sat, Sep 17 2016 11:45 PM

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను అభినందిస్తున్న కలెక్టర్‌ - Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు మణిపాత్రుని నాగేశ్వరరావు, పమ్మిన రమాదేవిలను కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహ శనివారం ఆయన కార్యాలయంలో అభినందించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులు మీదుగా వీరు అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ స్థాయి అవార్డులు సాధించడం అభినందనీయమన్నారు. మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో డి.దేవానంద రెడ్డి పాల్గొన్నారు. 
 
 

Advertisement
Advertisement