చలో కలెక్టరేట్‌కు తరలిరావాలి | Sakshi
Sakshi News home page

చలో కలెక్టరేట్‌కు తరలిరావాలి

Published Wed, Jul 27 2016 12:36 AM

comming teachers chelo collectarate

సూర్యాపేటటౌన్‌ : పండిట్, పీఈటీల అప్‌గ్రేడేషన్‌ కోసం ఈ నెల 28న కలెక్టరేట్‌ ఎదుట జరిVó  ఉపాధ్యాయుల ధర్నాను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు ఎన్‌.సోంబాబు, పి.రవికుమార్, సీహెచ్‌.వెంకటేశ్వర్లు, సోమయ్య   పిలుపునిచ్చారు. మంగళవారం స్థానికంగా జరిగిన సమావేశంలో చలో కలెక్టరేట్‌ కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిట్, పీఈటి అప్‌గ్రేడేషన్‌ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కె.సయ్యద్, మన్నె యాదగిరి, ఎ.నాగయ్య, వెంకట్‌రెడ్డి, వీరన్న, కష్ణారెడ్డి, లింగయ్య, దశరథరామారావు, సింహాద్రి పాల్గొన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement