విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ రూం పనుల్ని వేగవంతం చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. సోమవారం పనుల్ని పరిశీలించారు. నత్తనడకన సాగుతుండటంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరలో పనుల్ని పూర్తి చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నగరంలో చెత్త, నీటి సరఫరా తదితర అంశాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవచ్చన్నారు. కృష్ణా పుష్కరాల్లో ప్రయోగాత్మకంగా దుర్గాఘాట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పనిచేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. చీఫ్ ఇంజనీర్ ఎంఏ.షుకూర్, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) నరసింహమూర్తి, ఈఈ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Related news
Related News by category
-
సొమ్మంతా ప్రసాదార్పణం
కృష్ణాజిల్లాశుక్రవారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024అక్కడ వ్యాపారుల కూటమి షో అట్టర్ ఫ్లాప్ వెండితొడుగు బహూకరణ పామర్రు మండలం రాపర్లలో ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయానికి భక్తులు వెండి సర్వాంగాన్ని బహూకరించారు. బెజవాడలో భారీ అగ్ని ప్రమాదంవిజయవాడలో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లింది. మందుల, వస్త్రాల గోడౌన్లో ప్రమాదం సంభవించింది. u8లో సాక్షి ప్రతినిధి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ఫండ్ పేరుతో కూటమి అభ్యర్థి అందినకాడికి వసూలు చేసేస్తున్నాడు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భాగమైన ఆ నియోజకవర్గంలో ఆ అగ్రకుల పెత్తందారు సీటు దక్కించుకునే దగ్గర నుంచి అన్నింటా వసూళ్లే. ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదని నిర్థారణకు వచ్చిన ఆయన కొత్త ఎత్తుగడ వేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన, వసూళ్లకు తెగబడి అందినకాడికి దోచుకోవాలనే వ్యూహానికి తెర లేపారు. విజయవాడ సిటీకి ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గాన్ని కై వసం చేసుకుని తద్వారా ఇక్కడ ఉన్న సహజవనరులు దోచుకోవాలని, రియల్ వ్యాపారంలో కోట్లు కూడబెట్టాలన్నది ఆయన లక్ష్యం. అది ఫలించే సూచనలు కనిపించకపోవడంతో ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని తనకు ఇప్పుడు సహకరిస్తేనే...రేపు తన వంతు సహకారం ఉంటుందని అన్యాపదేశంగా హెచ్చరిస్తుండటం గమనార్హం. కప్పం కట్టాల్సిందేనంటూ ఇండెంట్లు జిల్లాలో హాట్ సీట్..ఇన్కం క్రియేట్ సీట్గా పేరున్న ఆ నియోజకవర్గంలో రియల్ వ్యాపారం అధికంగా జరిగే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బిల్డర్లు, రియల్ వ్యాపారులకు ఇప్పటికే ఇండెంట్లు ఇచ్చేశారు. వైద్యం, విద్య, వ్యాపార రంగంలో స్థిరపడ్డ వ్యక్తులను కూడా టార్గెట్ చేశారు. అన్నీ సజావుగా సాగాలంటే కప్పం కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. భవిష్యత్తు ‘‘కమ్మ’’గా ఉండాలంటే మీకు బాధ్యత ఉందా? లేదా? అనే సెంటిమెంట్నూ వాడుకుంటున్నారు. గ్రామాల వారీగా ఎన్ఆర్ఐల జాబితాను సిద్ధం చేసి తన అనుయాయుల ద్వారా ఫోన్లు చేయించి ఫండ్ రెడీ చేసుకోమని తాము చెప్పిన వ్యక్తుల ఖాతాలకు డబ్బులు పంపాలని సూచిస్తున్నట్టు తెలిసింది. 2014లో అధికారాన్ని అనుభవించిన ఆయన ఉచిత ఇసుక, రియల్ వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో వ్యాపారాలకు తన వంతు సహాయ సహకారాలను అందించారు. అడ్డగోలుగా సహజవనరుల్ని బొక్కేసి, అనుయాయులు నాలుగురాళ్లు వెనకేసుకునేలా తోడ్పాటునందించారు. ఈ దఫా వాళ్లందరినీ ఫండ్స్ కోసం టార్గెట్ చేసి గల్లా పెట్టె నింపుకొనే పనిలో పడ్డారు. ఎన్ఆర్ఐల ఫండ్తోనే సీటు దక్కింది ఆది నుంచి సీటు లేదని తేలిపోవటంతో ఏడ్చి పెడబొబ్బలు పెట్టాడాయన. ఎన్ఆర్ఐల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి, వారి ద్వారా కప్పం కట్టించి మరీ చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. ఇప్పుడిక వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇండెంట్లు పెట్టడానికి, ముక్కుపిండి వసూలు చేసేందుకు ఓ పది మందితో కూడిన కమిటీని వేశారు. ఓ మాజీ సర్పంచ్కు ఆ కమిటీ అధ్యక్ష పీఠం కట్టబెట్టి రంగంలోకి దించారు. ఇక ఆ కమిటీ కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఖర్చులకు కనీసం రూ.25 కోట్లకు పైగా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుని జల్లెడ పట్టేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి ఇచ్చేది, పార్టీ అధిష్టానం దయతలచి ఇచ్చేది కాగా వచ్చిన సొమ్ములో కొంత ఖర్చులు పోనూ మిగిలిన దాంతో ఇల్లు చక్కపెట్టుకునే పనిలో ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ద్వాదళ ప్రదక్షిణలు, పవళింపు సేవలు నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 9–30 గంటలకు దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు మంగళ స్నానాలను నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు, నూతన వధూవరులుగా అలంకరణ చేస్తారు. సాయంత్రం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, ఉత్సవాలకు అంకురార్పణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ, అగ్నిప్రతిష్టాపన, ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహిస్తారు. 19 నుంచి 23 వరకుగత ఎన్నికల్లో సైతం... జగన్కు అడుగడుగునా జన ప్రవాహం 7న్యూస్రీల్ఎన్నికలొస్తే ఆ అగ్రకుల అభ్యర్థికి పండగే...తన సామాజిక వర్గం దండిగా ఉన్న ఆ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కోటీశ్వరులు, ఎన్ఆర్ఐల జాబితాలు తయారుచేసి వసూళ్ల పర్వం మొదలెడతాడు. వచ్చిన దాంట్లో సగం ఖర్చు పెట్టి, మిగతా సగం వెనకేసుకుంటాడు. గతంలో ఇలాగే చేశాడు. ఈసారి ఆ పార్టీ టికెట్ కోసం విపరీతమైన పోటీ రాగా ఎన్ఆర్ఐల ఫండ్ గ్యారంటీతోనే చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం గెలుపుపై ఆశలు సన్నగిల్లిన ఆయన బరితెగించి వసూళ్ల కోసం ఏకంగా ఓ కమిటీనే నియమించాడు. ఊరూరా ఎన్ఆర్ఐలు, బడా వ్యాపారుల జాబితాలు సేకరించి వసూళ్ల పర్వం మొదలెట్టాడు. ఆ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి వసూళ్ల పర్వం వసూళ్ల కోసం ప్రత్యేకంగా కమిటీ నియామకం బిల్డర్లు, వ్యాపారులు, ఎన్ఆర్ఐలే లక్ష్యం కోట్లు వసూలు చేసి ఇల్లు చక్కబెట్టుకునే యత్నం ఇప్పటికే బోలెడు డెనేషన్ల వసూలు కూటమి అభ్యర్థి 2019లో అధిష్టానం ఇచ్చిన సొమ్ము, ఇతరత్రా ఫండ్స్లో ఖర్చుపెట్టగా తమ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో సుమారు రూ.4 కోట్లకు పైగా పందేలు కట్టారు. సొమ్ము పోయి శని పట్టింది. ఈ దఫా అలాంటి పరిస్థితి రాకుండా కొంత జాగ్రత్త వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పోయిన సొమ్ముతో పాటుగా ఈ దఫా అధికమొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. ఈ చందాల వసూళ్లు నియోజక వర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందే ఈ రేంజ్లో దోపిడీ ఉంటే...పొరపాటున ఈయన గెలిస్తే ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల రూపంలో ఆయనకు బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు. -
జగనన్న రావాలి.. పథకాలు అందుకోవాలి
ప్రజాదీవెనలో జెడ్పీ చైర్పర్సన్ హారిక బంటుమిల్లి: రాష్ట్రంలో తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా లబ్ధిదారుల ఇంటి ముందుకు వస్తాయని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బంటుమిల్లిలో ప్రజాదీవెన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) నాయకులు, కార్యకర్తలతో కలసి ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా హారిక, రాము ఇద్దరు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా రామును, మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావును గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వి. చినబాబు, వైస్ ఎంపీపీ ఒ.చిన్నారి బాబు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టి.శ్రీనివాసరావు, ఏఎంసీ వైస్చైర్మన్ పి. బాబూరావు, ఎంపీటీసీ సభ్యులు కమాల్ బాషా, పి.వీరబాబు, ఆలీం, కె. శ్రీనివాసరావు, కె.నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఎస్. మహేష్, నాయకులు ఎం. నాగేశ్వరరావు, ఎం.రాజబాబు, ఎం.వెంకటేశ్వరరావు, జి.బాల, సీహెచ్ రాధాకృష్ణ, బి. గాంధీ, పి.నాని తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
● అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు నామినేషన్లు ● పార్లమెంట్ స్థానానికి దాఖలు కాని నామినేషన్లు చిలకలపూడి(మచిలీపట్నం): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలక ఘట్టమైన అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పామర్రు అసెంబ్లీ సెగ్మెంట్కు టీడీపీ అభ్యర్థిగా వర్ల కుమార్రాజా గురువారం రిటర్నింగ్ అధికారి శ్రీదేవికి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి వక్కలగడ్డ పావని రిటర్నింగ్ అధికారి ఎం.వాణికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు. గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రెండు సెట్ల నామినేషన్లు, ఆయన భార్య యార్లగడ్డ జ్ఞానేశ్వరి ఒక సెట్ నామినేషన్ రిటర్నింగ్ అధికారి గీతాంజలిశర్మకు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో అసెంబ్లీకి 11,పార్లమెంట్కు రెండు నామినేషన్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం –1 పబ్లిక్ నోటీసు జారీ చేయడంతో ఈ నామినేషన్ల పర్వం మొదలైంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్వో కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు పబ్లిక్ నోటీసు జారీ చేశారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి రోజు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో విజయవాడ పార్లమెంట్కు సంబంధించి 2, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 11 నామినేషన్లు వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే తొలి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. -
జగన్ ఆశయాలు ఉన్నతం
కోనేరుసెంటర్: పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యం, విద్య ఉచితంగా అందజేయాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి ఉన్నత ఆశయం ఎంతో గొప్పదని వైఎస్సార్ సీపీ బందరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అన్నారు. బందరు మండలం వాడపాలెంలో గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ సీఎం ఆశయాలు ఉన్నతమైనవన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో వేలాదిమంది ఆరోగ్యానికి భరోసా కల్పించారన్నారు. ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి తండ్రికి మించిన వైద్య సాయాన్ని పేద, మధ్యతరగతి ప్రజలకు అందజేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు మాట్లాడుతూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను అందించేలా పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టమన్నారు. గ్రామాలకే అన్ని విభాగాల వైద్య నిపుణులను రప్పించి మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సైతం వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో కూడిన ఉచిత విద్య అందుతుందన్నారు. మనందరి కోసం ఎన్నోసార్లు బటన్ నొక్కిన జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకునేందుకు వచ్చే ఎన్నికల్లో మీరంతా ఒక్కసారి ఆయన పార్టీ గుర్తుపై బటన్ నొక్కి అఖండ మెజార్టీని అందజేయాలని కోరారు. ఎన్నికల బరిలోకి దిగుతున్న తమను సహృదయంతో ఆశీర్వదించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బందరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖరరావు -
No Headline
సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి ఎక్కడకు వెళ్లినా జన ప్రవాహం ఉవ్వెత్తున కదిలివస్తోంది. ఈ నెల 15వ తేదీన వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లే వరకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. గన్నవరం బస్సు యాత్రలో, బహిరంగ సభ ఏర్పాటు చేసిన గుడివాడలో వీధులన్నీ జనంతో నిండిపోయాయి. 10 ఎకరాల సభా మైదానం కిక్కిరిసిపోయి వేల మంది రోడ్లపైనే ఉండిపోయారు. జగన్ సభలకు వచ్చిన జనంతో పోలిస్తే... చంద్రబాబు కూటమి షోలు జనం లేక వెలవెలపోయాయి. సాక్షి, మచిలీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు మూడు పార్టీల కూటమితో కలిసి నిర్వహిస్తున్న షోలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ప్రజల మద్దతు లేకపోవడంతో అసహనానికి గురవుతున్న ఆ పార్టీ నేతలు సంక్షేమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్పై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా తమ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. జనసేన, బీజేపీలతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న షోలు, సభలకు ఏ మాత్రం స్పందన కానరావడం లేదు. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలకు డబ్బు, మందు, బిర్యానీలు ఆఫర్ ఇచ్చి రప్పించినా.. సభ పూర్తయ్యే వరకు కూడా వారు ఉండడం లేదు. పాడిందే పాట అన్నట్లు చంద్రబాబు చెప్పిందే చెబుతుండడంతో ఆ సోది వినలేక సభ ప్రారంభమై, బాబు మైకు అందుకోగానే జనం వెనక నుంచి గుంపులు గుంపులుగా ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పెడన, మచిలీపట్నంలో... ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన జనసేన నేత పవన్ కల్యాణ్తో కలిసి జిల్లాలోని పెడన, మచిలీపట్నంలలో కార్యక్రమం నిర్వహించారు. సభను జయప్రదం చేసి, ఉనికి కాపాడుకోవాలనే తాపత్రయంలో కూటమి నేతలు ఎంత కసరత్తు చేసినా ప్రజల నుంచి అంతంత మాత్రంగానే స్పందన లభించింది. ఇది ముందే ఊహించిన పార్టీ నేతలు తమ సభలను మైదానాల్లో కాకుండా ఇరుకు సందులు, ట్రాఫిక్ ఉండే రోడ్లలో ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం. పెడనలో బస్టాండ్ సెంటర్లో, మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ నిలిపివేసి సభలు నిర్వహించారు. పెడనలో మూడు పార్టీలు కలిసినా 3వేలకు మించని జనం. మచిలీపట్నంలో సైతం 5వేలు దాటలేదు. గతంలో పామర్రు, ఉయ్యూరుల్లోనూ ఇదే పరిస్థితి. జనం లేక ఆలస్యంగా సభలు జన సమీకరణ కోసం కూటమి అభ్యర్థులు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. షెడ్యూల్ ప్రకారం పెడనలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైంది. మచిలీపట్నంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటలకు ఆరంభమైంది. ఆచరణకు సాధ్యం కాని అబద్ధపు హామీలతో కూడిన చంద్రబాబు ప్రసంగం వినే ఓపిక తమకు లేదని జనం అనుకుంటున్నారు. బాబు మాట్లాడడం ప్రారంభమైన వెంటనే జనం గుంపులు గుంపులుగా వెనుతిరిగి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఎక్కడా కనిపించని బీజేపీ జెండాలు ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు జనసేన, బీజేపీలతో జత కట్టారు. అయితే ఆయన ఆ పార్టీ అధినేతలను తన వైపు తిప్పుకున్నప్పటికీ కింది స్థాయి కేడర్, కార్యకర్తల నుంచి పూర్తి స్థాయి మద్దతు కరువైంది. మచిలీపట్నంలో జరిగిన సభలో బీజేపీ జెండాలు ఎక్కడా కనిపించలేదు. జనాకర్షణ ఏ మాత్రం లేని చంద్రబాబు, పవన్ పర్యటన గళం వినే జనం లేక గంటల సేపు బస్సులోనే బాబు మూడు పార్టీలు కలిసి సమీకరించినా అంతంతమాత్రంగానే హాజరు మచిలీపట్నంలో కనిపించని బీజేపీ నేతలు, జెండాలు బాబు మైకు అందుకోగానే సోది వినలేక వెనుతిరిగిన జనం
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement