అన్నాచెల్లెళ్ల మధ్య పరిహారం చిచ్చు | Sakshi
Sakshi News home page

అన్నాచెల్లెళ్ల మధ్య పరిహారం చిచ్చు

Published Thu, Aug 3 2017 1:10 AM

అన్నాచెల్లెళ్ల మధ్య పరిహారం చిచ్చు - Sakshi

అన్నపై సోదరి దాడి

కుక్కునూరు: పోలవరం ప్రాజెక్ట్‌ పరిహారం విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరడంతో అన్నపై చెల్లెలు దాడి చేసింది.రక్తపు గాయాలైన అన్న కుక్కునూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ముత్యాలంపాడు గ్రామానికి చెందిన గడేసుల పిచ్చయ్య (68), సంకురాత్రి సత్యవతి అన్నాచెల్లెళ్లు. పోలవరం భూసేకరణలో భాగంగా వింజరం పంచాయతీ పరిధిలోని 2.30 ఎకరాలకు సంబంధించి అవార్డు విచారణకు ముందు పరిహారం మొత్తాన్ని ముగ్గురు సోదరులు, సోదరికి పంచేలా సత్యవతి పెద్దమనుషుల సమక్షంలో అగ్రిమెంట్‌ రాసి ఇచ్చింది.

అయితే పరిహారం తన ఖాతాలో జమైన తర్వాత సత్యవతి ఎదురుతిరగడంతో పిచ్చయ్య గొడవ పడ్డాడు. మంగళవారం ముత్యాలంపాడు తన భూమిలో ఉన్న జామాయిల్‌ చెట్లను నరికేందుకు వచ్చిన సత్యవతిని పిచ్చయ్య అడ్డుకున్నాడు. దీంతో పిచ్చయ్య కళ్లల్లో కారం కొట్టి కత్తితో దాడి చేసింది. పిచ్చయ్య కుడి మణికట్టుకు తీవ్ర గాయమైంది. స్థానికులు పిచ్చయ్యను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement