అడవిదేవులపల్లి (దామరచర్ల) : నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం ముగిసింది. ఈ సందర్భంగా నడిగడ్డ, టెయిల్ పాండ్ల వద్ద జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. భూముల రకాలతో నిమిత్తం లేకుండా 2013 చట్టం ప్రకారం నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. రైతులకు అన్యాయం జరిగితే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన సప్రీం కోర్టుకు సైతం వెళ్తామన్నారు. భూములు కోల్పోయిన కుటుంబాలన్నింటికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ టెయిల్ పాండ్ నిర్మాణంతో 8 ఎత్తిపోతల పథకాలు నీట మునగనున్నాయన్నారు. వీటి కింద ఉన్న 5 వేల ఎకరాలు ఎండి పోయే ప్రమాదముందన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని కోరారు. ముంపునకు గురయ్యే చిట్యాల, నడిగడ్డ, చింతలపాలెం, జమ్మికోట తండా వాసులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. టెయిల్ పాండ్ జెన్కో ఎస్ఈ కుమార్ మాట్లాడుతూ సమస్య తీవ్రతను గుర్తించామని, ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధీరావత్ రవినాయక్, జిల్లా అధ్యక్షుడు పాపానాయక్,ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొప్పని పద్మ, మల్లు లక్ష్మి, రైతు సంఘం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ యాదవ్, నాగిరెడ్డి, కత్తి లింగారెడ్డి, ఇంద్రారెడ్డి, ఎర్రానాయక్, మాజీ సర్పంచ్ కురాకుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాలి
Published Thu, Jul 21 2016 8:21 PM
Related news
-
నేడు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజా స్వామ్య హక్కులను కాల రాస్తోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఎస్.వీరయ్య మండిప డ్డారు. వామపక్ష పార్టీల సమావేశం శుక్రవారం ఎంబీ భవన్లో జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ ధోరణులను సమావేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం ఉద యం 11 గంటలకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపా రు. స్వచ్ఛందంగా పనిచేసే ఈడీ, ఐటీ, సీబీఐలను తమ జేబు సంస్థలుగా కేంద్రం వాడుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోకుండా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల నా యకులను భయభ్రాంతులకు గురిచేస్తోందని విరుచుకుపడ్డారు. అందులో భాగంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోపా టు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలను అరెస్టు చేసిందన్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు డీజీ నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ నాయకులు రమ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, ఎంసీపీఐ(యు) నాయకులు వనం సుధాకర్, ఎస్ యూసీఐ(యు) నాయకులు తేజ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు కోటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. -
ఘనమైన చరిత్ర నుంచి గట్టెక్కలేని స్థితికి..
స్వతంత్ర భారతావనికి జరిగిన తొలి ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఎంపీతోనే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలన్న నిర్ణయం జరిగింది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు కూడా దక్కని ఆ ఖ్యాతి కమ్యూనిస్టులకు దక్కింది. 1952 మార్చిలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టుల అభ్యర్థి రావినారాయణ రెడ్డి, నెహ్రూకన్నా అత్యధిక మెజారిటీలో విజయం సాధించారు. రావి నారాయణ రెడ్డికి ఆ ఎన్నికల్లో 3,09,162 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్ కమ్ జౌన్పూర్ (పశ్చిమ) ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జవహర్లాల్ నెహ్రూకు మాత్రం 2,33,571 ఓట్లు పడ్డాయి. దీంతో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అరుదైన అవకాశం కమ్యూనిస్టులకు దక్కినట్లయ్యింది. ఇపుడు ఈ చరిత్రనంతా నెమరు వేయడం ఎందుకంటే.. కమ్యూనిస్టుల ప్రాభవం ఏ విధంగా ఉండేదో గుర్తు చేసుకోవడం కోసం.. ఇప్పటి వారి పరిస్థితిపై ఓ అంచనాకు రావడం కోసం. ఉనికి కోసం వారు పడుతున్న ఆరాటాల గురించి చర్చించుకోవడం కోసం. తెలంగాణ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ బీఆర్ఎస్ నిరాదరణకు గురై, కాంగ్రెస్ కు స్నేహ హస్తం చాచినా ఆ పార్టీ పట్టించుకోక పోవడంతో ఇపుడు ఎలాంటి ఎన్నికల పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాల్సి వచ్చింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా అసెంబ్లీ సీట్లను గెలుచుకునే స్థితి నుంచి కమ్యూనిస్టులు ఎపుడో కిందకు జారిపోయారు. కమ్యూనిస్టులది ఘనమైన చరిత్రే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు అంటే 1983 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వైరి వర్గాలు కాంగ్రెస్, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలే. కమ్యూనిస్టులు సీపీఐ, సీపీఎంలుగా విడివడ్డాక క్రమేణా కాంగ్రెస్ ను ధీటుగా ఎదుక్కోవడంలో ఉభయ కమ్యూనిస్టులు విఫలమవుతూ వచ్చారు. ఈ తరుణంలోనే ఎన్టీ రామారావు నాయకత్వంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీకి దగ్గరై, పోత్తులు పెట్టుకోవడం మొదలు పెట్టారు. నాటి ఆర్ధిక మంత్రి నాదేండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు, తెలుగుదేశంలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ ను తిరిగి సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో వామపక్షాలది తీసివేయలేని పాత్ర. వాస్తవానికి 1983లో ఎన్టీఆర్ ప్రభంజనలో సైతం వామపక్షాలు తమ ఉనికిని చాటాయి. ఆ ఎన్నికల్లో సీపీఐ 4 నియోజకవర్గాల్లో, సీపీఎం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. అంటే అప్పటికి ఆ పార్టీలకు ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయలేం. కానీ, తర్వాత వరసగా జరిగిన 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీతో జతకట్టి బరిలోకి దిగాయి. ఇక్కడి వరకు సవ్యంగా సాగిన టీడీపీ, లెఫ్ట్ పార్టీల స్నేహం ( ఒక విధంగా ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఉన్నన్ని రోజులు..) ఆతర్వాత బ్రేక్ అయ్యింది. చంద్రబాబు అవకాశవాదంతో టీడీపీకి దూరమైన వామపక్షాలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిన 1999 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో చంద్రబాబు అవకాశవాదానికి షాకైన వామపక్షాలు, టీడీపీకి దూరమయ్యాయి. ఆ ఎన్నికల్లో సీపీఎం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించగా, సీపీఐకి ఒక్క చోటా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జరిగిన పొత్తులో లాభపడిన సీపీఐ 6, సీపీ ఎం 9 నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్నాయి. కాంగ్రెస్తో వచ్చిన పొరపొచ్చాల వల్ల 2009 ఎన్నికల్లో మహాకూటమి లో భాగంగా టీడీపీ, బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) తో ఎన్నికలు వెళ్లాయి. అప్పుడు కూడా సీపీఐ 4 చోట్ల , సీపీఐఎం ఒక చోట గెలిచాయి. గడిచిన నాలుగు దశాబ్ధాల కాలంలో అంటే 1983 నుంచి ఇప్పటి దాకా ఏదో ఒక పార్టీ అండలేకుండా అసెంబ్లీ సీట్లను గెలుచుకోలేని స్థితికి వామపక్షాలు చేరుకున్నాయి. చివకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణలో సీపీఐ(ఎం) వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టకుని ఒక చోట, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఒక చోట గెలిచాయి. 2018 ఎన్నికలు తెలంగాణలో ఆ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా చేశాయి. మునుగోడు ఉప ఎన్నికతో.. బీఆర్ఎస్ తో దోస్తీ 2023 ఎన్నికల్లో మొదట బీఆర్ఎస్ తో కలిసి వెళతాయని భావించినా, అది బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలు వేదికగా ఆ నియోజకవర్గంలో బీజేపీని ఎదుర్కునే శక్తి బీఆర్ఎస్ కే ఉందని పేర్కొంటూ ఆ పార్టీతో జతకట్టాయి. ఆ ఎన్నికల్లో వామపక్షాల మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచిందని అంతా భావించినా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం వామపక్షాలను కరివేపాకులా తీసి పక్కన పడేశారు. 2023 ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సమయంలో తమ మిత్రపక్షాలుగా భావిస్తున్న వామపక్షాలతో మాటమాత్రంగా కూడా చర్చలేవి జరపకుండా ఏక కాలంలో 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సీపీఎం, సీపీఐ పోటీ చేయాలని భావించిన స్థానాలు కూడా ఉండడం విశేషం. దీంతో బీఆర్ఎస్, వామపక్షాల మధ్య చెడిందని, పొత్తు లేనట్టేనన్న అర్థమై పోయింది. జాతీయ రాజకీయాల్లో భాగంగా ‘ ఇండియా ’ కూటమిలో కాంగ్రెస్ తో వామపక్షాలు కలిసి నడుస్తున్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని భావించినా.. ఆ పార్టీల మధ్య ఇంకా పొత్తు పొడవలేదు. దాదాపు తెలంగాణలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉండక పోవచ్చని, ఒంటరిగానే వామపక్షాలు పోటీ చేయనున్నాయని తెలుస్తోంది. దీంతో వామపక్ష పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకు ఎవరి జయాపజయాల్లో కీలకం కానుందన్న సమీకరణలు మొదలయ్యాయి. వామపక్షాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నాయి..? చివకు కనీసం ఉభయ కమ్యూనిస్టుల పార్టీల మధ్యనైనా సరైన అవాగాహన కుదురుతుందా అన్న ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది. :::మిత్రా. ఎన్ -
‘కమ్యూనిస్ట్లు అంటే ఏంటో అందరికీ తెలియజేస్తాం’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ పదే పదే చెప్పారని, కానీ, ఏకపక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించారని వామపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అనంతరం వామ పక్ష నేతలు సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తమ్మినేని మాట్లాడుతూ.. ‘‘మునుగోడులో మద్ధతు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. బీజేపీ దూకుడును నిలువరించాలన్నది అప్పుడు మా విధానం. ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు బీఆర్ఎస్కు మద్ధతు ఇవ్వాల్సి వచ్చింది. లెఫ్ట్పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆరే ప్రకటించారు. ఇప్పుడు ఏకపక్షంగా జాబితా ప్రకటించారు. మేం కోరిన సీట్లలో కూడా అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇది సీట్ల సర్దుబాటు సమస్య కాదు. కేసీఆర్ రాజకీయ వైఖరిలో తేడా వచ్చిందేమో అని తమ్మినేని అన్నారు. మాతో చర్చలకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ఇండియా కూటమిలో ఉండడం నచ్చలేదని చెప్పారు. ఎన్డీయేకు దూరంగా ఉంటామన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని పదే పదే కేసీఆరే స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో ఏకపక్షంగా జాబితా ప్రకటించారు. కేసీఆర్ రాజకీయ విధానంతో సమస్య వచ్చింది అని తమ్మినేని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణలో సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేస్తుంది. ఎవరితో కలవాలనేది భవిష్యత్తులో నిర్ణయిస్తాం. మాతో కలిసి వచ్చేవారితో పని చేస్తాం. కమ్యూనిస్ట్లు అంటే ఏంటో అందరికీ తెలియజేస్తాం. నిర్ణయాత్మక పాత్ర రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో పోషిస్తాం. బీజేపీతో బీఆర్ఎస్కు ఎక్కడో మిత్రత్వం జరిగింది. బీజేపీకి దగ్గరైతే.. కేసీఆర్ మిత్ర ధర్మం పాటించరా. లెఫ్ట్లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ గెలిచేదా?. మునుగోడులో బీజేపీ గెలిస్తే ఇవాళ ఇంతటి ప్రశాంత వాతావరణ ఉండేదా?. ఎంతటి బేరసారాలు జరిగాయో కేసీఆర్ మర్చిపోయారా? కేసీఆర్కు బీజేపీ అండదండలు ఉంటే చాలు అనుకుంటున్నారా? అని కూనంనేని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉందని.. ఈ నెల 27 తర్వాత వామపక్ష పార్టీలు మరోసారి ఉమ్మడిగా భేటీ అవుతామని, ఆ తర్వాతే కార్యచరణ ప్రకటిస్తామని వామపక్ష నేతలు వెల్లడించారు. -
కమ్యూనిస్టుల దారెటు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో కమ్యూనిస్టు, బీఆర్ఎస్ పార్టీలు వచ్చే సాధారణ ఎన్నికలో పొత్తు పెట్టుకుంటాయని అంతా భావించినా అది కుదరలేదు. తమకు అవకాశం వస్తుందని భావించిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో అంచనాలు తలకిందులయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీతో బీఆర్ఎస్ జత కట్టింది. ఆ సందర్భంలోనే.. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పనిచేస్తామని ఇరుపార్టీల నేతలు ప్రకటించారు. నిన్నటి వరకు కూడా కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని అంతా అనుకున్నారు. కానీ, కమ్యూనిస్టులు అడిగే స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తు లేనట్లేనని తేలిపోయింది. కామ్రేడ్ల పొత్తు ఎవరితో.. దేశంలోనే ఎప్పుడూలేని విధంగా మునుగోడు ఉప ఎన్నిక పోటాపోటీగా జరిగింది. ఇందులో కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాయి. ఇక ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో సహా ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ జరిగింది. ఈ రెండు పార్టీలు యుద్ధాన్ని తలపించేలా ప్రచారం కొనసాగించాయి. మొత్తానికి ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంలోనే కమ్యూనిస్టుల పొత్తుతోనే విజయం సాధించినట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. భవిష్యత్తులోనూ ఎన్నికల్లో కలిసే పనిచేస్తామని ప్రకటించింది. ఆ తరువాత పొత్తుల్లో భాగంగా స్థానాల కేటాయింపుపై అంచనాలు పెరిగిపోయాయి. మునుగోడు ఎలాగైనా సీపీఐకి వస్తుందని అంచనా వేసుకున్నారు. లేదంటే మిర్యాలగూడను సీపీఎంకు కేటాయిస్తారని ఆ పార్టీ భావించింది. గతంలో సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి అక్కడ నుంచి గెలుపొందారు. దీంతో ఆ స్థానంపై సీపీఎం ఆశ పెట్టుకుంది. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం, సీపీఐలకు ఒకటి చొప్పున టికెట్ ఇస్తారని, సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు ఇస్తారన్న చర్చ సాగింది. అయితే సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితా ప్రకారం పొత్తు లేదని తేల్చేశారు. మిర్యాలగూడలో సిట్టింగ్ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావుకు, మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి బరిలో ఉంటారని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? సొంతంగా పోటీ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. -
బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు తిరుగుతున్నారా?.. సీపీఎం నేతలు ఫైర్
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబుపై సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, శ్రీనివాసరావు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీ దేశాభివృద్ధి కోసం పనిచేయడం లేదని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధి ఏంటో చంద్రబాబు ప్రజలకి చెప్పాలని నిలదీశారు. పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా.. బాబు చెప్పాలంటూ తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. ‘‘బీజేపీ దేశాభివృద్ధి కోసం పనిచేయడం లేదని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధి ఏంటో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా.. బాబు చెప్పాలి. రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్న మోదీ హామీ నిలబెట్టుకున్నారా? బాబు చెప్పాలి. 2022 కల్లా దేశంలో బుల్లెట్ ట్రైన్ మోదీ నడుపుతామన్నారు.. బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు తిరుగుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు. చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’ ‘‘18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన మోదీ అవి ఇచ్చారా.. చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు మోదీలో చూస్తున్నది అభివృద్ధి కాదు, పచ్చి అవకాశవాదం. గడ్డిపరకనైనా పట్టుకుని ఏపీలో అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న మోదీ విజన్లో పేదలకు, ప్రజలకు స్థానం ఎక్కడ?, పెట్టుబడిదారుల విజన్ మతోన్మాదుల విజన్ అసలు విజన్ కాదు. మోదీ, చంద్రబాబుది విజన్ కాదు.. అదొక డివిజన్’’ అంటూ తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏ విజన్తో మోదీకి సపోర్ట్ చేస్తున్నారు:శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను టీడీపీ వ్యతిరేకిస్తామని చెబుతోంది. మరి మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోంది. మరి చంద్రబాబు ఏ విజన్తో మోదీకి సపోర్ట్ చేస్తున్నారు’’ అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను ఎత్తివేయాలని మోదీ అంటున్నారు. చంద్రబాబు మరి కంటిన్యూ చేస్తా అంటున్నారు.. ఇందులో ఉన్న విజన్ ఏమిటి?. చంద్రబాబుది రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి లేదు. ఈ వైఖరితో చంద్రబాబు ఎన్నడూ ప్రజల విశ్వాసాన్ని పొందలేరు’’ అని శ్రీనివాసరావు దుయ్యబట్టారు. చదవండి: ఒక ముఖ్యమంత్రికి ఇంతటి స్పందన రావడం జగన్ విషయంలోనే..
Related News by category
-
కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూర్యాపేట : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హ్యాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి సూర్యాపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవదని.. ఆ పార్టీ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 20 నుంచి 25 మంది త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారని ఉత్తమ్ జోస్యం చెప్పారు. 10 ఏళ్లు తెలంగాణను బీఆర్ఎస్ మోసం చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కనీస న్యాయం జరగలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలిచి రాహుల్గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు 15 ఎంపీ స్థానాలు దక్కుతాయని, నల్లగొండ అభ్యర్థి రఘువీర్రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మాట్లాడుతూ పేటలో కాంగ్రెస్ బలంగా ఉందని, అనుబంధ సంఘాలు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు. సమావేశంలో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కె.రఘువీర్రెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, సూర్యాపేట, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, శంకర్నాయక్, ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, తండు శ్రీనివాస్యాదవ్, చకిలం రాజేశ్వర్రావు, కొప్పుల వేణారెడ్డి, పెద్దిరెడ్డి రాజా, కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకానికి ప్రభుత్వ భూమి!
ఫ పేదల భూమిపై పెద్దల కన్ను ఫ అనధికారిక కమిటీతో భూ పంపిణీకి కసరత్తు ఫ 73 గజాల ప్లాట్కు రూ.70 వేలు ఇవ్వాలని హుకుం జారీ ఫ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ ఫ మిర్యాలగూడ మండలం లక్ష్మీపురంలో కొందరి నిర్వాకం మిర్యాలగూడ: పేదల ఇళ్ల స్థలాల కోసం ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను అమ్మకానికి పెట్టారు కొందరు పెద్దలు. గతంలో ఇల్లు కట్టుకోలేకపోయిన వారి స్థలాలతోపాటు ఇల్లు నిర్మించుకొని నివాసముంటున్న వారు కూడా కొంత డబ్బు చెల్లిస్తేనే ఆ స్థలాలు, ఇళ్లు మీకు దక్కుతాయని, లేదంటే వేరే వాళ్లకు కేటాయిస్తామని బెదిరిస్తున్నారు. ఈ తతంగం మిర్యాలగూడ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. గ్రామంలోని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇరవై ఏళ్ల క్రితం స్థానికంగా సర్వేనంబర్ 437లో 4.24 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 20 మందికి వంద గజాల చొప్పున పంపిణీ చేసింది. ఇందులో ఐదారుగురు మాత్రమే ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు కట్టుకోగా కొందరు బేస్మెంట్ లెవల్, కొందరు కంచె వేసుకొని ఇంటి స్థలాన్ని ఆపుకున్నారు. ఇందులో ఇంకా 3 ఎకరాల భూమి మిగిలి ఉంది. దీనిపై స్థానిక నాయకుల కన్ను పడింది. ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని పథకం పన్నారు. దీంతో అనధికారికంగా 14 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి గతంలో ప్రభుత్వం పంపణీ చేయగా మిగిలిన భూమిని పేదలకు పంచుతామని ప్రకటించారు. ఈ నెల 23న లబ్ధిదారుల ఎంపిక చేస్తామని, అర్హుల పేర్లు సేకరిస్తూ ఒక్కొక్కరి నుంచి ఎంట్రీ ఫీజుగా రూ.1,500 వసూలు చేశారు. మొత్తం 190 మందికి 73 గజాల చొప్పున ఇస్తామని నిర్ణయించారు. ఇందుకు గ్రామ కమిటీకి గుండుగుత్తగా మొత్తం రూ.70 వేలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో గతంలో వంద గజాలు కేటాయించిన 20 మంది లబ్ధిదారుల నుంచి 73గజాలు పోను మిగతా వాటికి డబ్బులు అయినా కట్టండి లేదా భూమినైనా వదిలి పెట్టండని ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఇదీకాక వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులను సైతం డైబ్బెవేల రూపాయలు కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్పటి లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని గ్రామానికి చెందిన పేదలు కోరుతున్నారు. డబ్బులు ఇస్తేనే ఇల్లు కట్టుకోవాలట.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో నాకు ప్రభుత్వం ఇంటి స్థలం వచ్చింది. అప్పట్లో ఇల్లు కట్టుకోవాలని బేస్మెట్ నిర్మాణం చేశాను. కానీ, ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేక అలానే వదిలేశాను. అదే బేస్మెట్పై నీవు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే రూ.70 వేలు ఇవ్వమని పెద్దమనుషులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఎదుకు డబ్బులివ్వాలో అర్థంకావట్లేదు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – ఆడోతు రవి, లక్ష్మీపురం -
రైలు పట్టాల సమీపంలో మంటలు
● పలు రైళ్ల రాకపోకలకు అంతరాయంమిర్యాలగూడ అర్బన్: రైలు పట్టాల సమీపంలో మంటలు వ్యాపించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని కుక్కడం వద్ద చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ పవన్కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం వద్ద రైలు పట్టాల సమీపంలో రైతులు ఎండిపోయిన వరి కొయ్యలకు నిప్పుపెట్టడంతో మంటలు క్రమంగా వ్యాపిస్తూ రైలు పట్టాల వద్దకు వచ్చాయి. దీంతో విషయాన్ని తెలుసుకున్న రైల్వే సిబ్బంది గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలును మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. మంటలను ఆర్పిన అనంతరం రైలు బయలుదేరి వెళ్లింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు రైల్వే ఎస్ఐ పేర్కొన్నారు. నీటి ఎద్దడి రాకుండా చూడాలి కేతేపల్లి: ప్రస్తుత వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ టి.నాగిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కేతేపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కేతేపల్లి, శాలిగౌరారం మండలాలకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై అధికారులు, సిబ్బందితో సంయుక్తంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. తాగునీటి ట్యాంకులను నెలలో మూడు సార్లు శుభ్రం చేయించటంతో పాటు, లీకేజీ అయిన పైప్లైన్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ పనులు లేనందున అన్ని గ్రామాల్లో కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, డీఎల్పీఓ వెంకటేశ్వర్లు, ఆయా మండలాల ఎంపీడీఓలు బి.శ్రీనివాసరావు, లక్ష్మినారాయణ, ఎంఈఓ నాగయ్య, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు శ్రీనివాస్, మౌనిక, ఐకేపీ ఏపీఎం యాదమ్మ, ఈజీఎస్ ఏపీఓ సురేందర్, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రీశుడికి లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సహస్రనామ పఠనాలతో అర్చకులు, వేద పండితులు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేశారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అభిషేకం, ఆలయ ముఖ మండపం, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజ వాహనసేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవంతో పాటు శ్రీస్వామి, అమ్మవారి సేవలను ఊరేగించారు. వైభవంగా ఊంజలి సేవోత్సవం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవోత్సవం చేపట్టారు. ఆ తర్వాత ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. -
నా ఇంటిలో గెట్టు పెడుతున్నారు
ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం. నా తండ్రి కాలం చేయడంతో ఆ ఇల్లు వారసత్వంగా నాకు వచ్చింది. ఇరవై ఏళ్లుగా ఇంటి పన్ను కడుతూనే ఉన్నా. కానీ, ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చి ఆ స్థలం నీకు ఇవ్వాలంటే రూ.70 వేలు ఇవ్వు అని బెదిరిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టిన చర్యలు తీసుకోవాలి. – తిప్పన క్రిష్ణారెడ్డి (లక్ష్మీపురం) ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఉపేక్షించం ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన విషయం నా దృష్టికి రాలేదు. లక్ష్మీపురం గ్రామంలో సర్వే నంబర్ 437లో ఉన్న 4.24 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని 20 మంది లబ్ధిదారులకు కేటాయించగా మిగిలిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రభుత్వం ద్వారానే ఆ భూమిని పంపిణీ చేస్తాం. కబ్జాలకు పాల్పడితే రెవెన్యూ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రావు, ఆర్డీఓ, మిర్యాలగూడ -
రెండో రోజూ స్వల్పమే..
నల్లగొండ: నల్లగొండ లోక్సభ స్థానానికి రెండో రోజైన శుక్రవారం మరో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు నలుగురు అభ్యర్థులు ఆరుసెట్ల నామినేషన్లు దాఖలు చేయగా రెండో రోజు మాత్రం నలుగురు అభ్యర్థులు ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. దీంతో రెండురోజుల్లో ఎనిమిది మంది అభ్యర్థులు పది సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు నామినేషన్లను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన స్వీకరించారు. నామినేషన్లు సమర్పించింది వీరే.. రెండో రోజు స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో బండారు నాగరాజు, కిన్నెర యాదయ్య ఉన్నారు. అలాగే ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా తలారి రాంబాబు నామినేషన్ సమర్పించారు. మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) అభ్యర్ధిగా వసుకుల మట్టయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి తరఫున ఒక నామినేషన్ సెట్ దాఖలు కాగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఒకటి, ఇద్దరు రెండు సెట్ల చొప్పున, ప్రజావాణి పార్టీ, సోషలిస్టు పార్టీ, ధర్మసమాజ్ పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఒక్కొక్కరు ఒక్కో సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి ఎంపీ స్థానానికీ అంతంతే.. సాక్షి, యాదాద్రి: లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భువనగిరి స్థానానికి రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్, బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్, సోషలిస్ట్ పార్టీ (ఇండియా) అభ్యర్థిగా రచ్చ సుభద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా మెగావత్ చందునాయక్, రేకల సైదులు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు. మొదటి, రెండో రోజు కలిపి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లు వేశారు. అట్టహాసంగా సీపీఎం అభ్యర్థి నామినేషన్ సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జహంగీర్ వెంట సీపీఎం పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండమడుగు నర్సింహ ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే జన సమీకరణ చేయకుండా సాదాసీదాగా వచ్చి నామినేషన్ వేశారు. నల్లగొండ లోక్సభ స్థానానికి ఎనిమిది నామినేషన్లు రెండు రోజులు నలుగురు అభ్యర్థుల చొప్పున దాఖలు మొత్త పది సెట్ల నామినేషన్లు
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement