అనంతపురం అర్బన్: రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెలలో పెద్ద ఎత్తున్న సదస్సులు, సమావేశాలను నిర్వహించాలని సీపీఐ కార్యదర్శి వర్గం తీర్మానించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తెలిపారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. అనంతరం జగదీశ్ విలేకరులతో మాట్లాడారు. వి.కె.ఆదినారాయణరెడ్డి శత జయంతి ఉత్సవాలను అక్టోబరు 8న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు సామర్థ్యాన్ని 100 టీఎంసీలకు పెంచాలని ఈనెల 20న అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. విద్యా, వైద్య రంగాలపై ఎస్కేయూలో, ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభించాలన్న డిమాండ్తో 22న రాయదుర్గంలో, పీఏబీఆర్ కుడికాలు కింద ఉన్న చెరువులు, చెక్డ్యాంలకు కృష్ణా జలాలు కేటాయించాలన్న డిమాండ్తో ఈ నెల 28న రాప్తాడులో సదస్సు నిర్వహిస్తామన్నారు.
అలాగే గుంతకల్లు నియోజవర్గంలోని చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీరు ఇవ్వాలన్న ఽడిమాండ్తో 29న గుంతకల్లులో సదస్సు నిర్వహిస్తామన్నారు. చేనేత రంగంపై జీఎస్టీ ఎత్తివేయాలని ధర్మవరంలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తామనారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని సమస్యలపై 30న పుట్టపర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కార్యదర్శి వర్గం నిర్ణయించిందన్నారు. అలాగే గార్లదిన్నెలో 31న రైతాంగ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కరువు పరిస్థితులపై సెప్టెంబరు ఒకటిన కదిరిలో సెమినార్ నిర్వహిస్తామన్నారు.
ప్రజా సమస్యలపై సదస్సులు
Published Thu, Aug 17 2017 10:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement