రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే (ప్రజాసాధికారిక సర్వే) గందరగోళంగా మారింది. యాప్ డౌన్లోడ్కాక, సర్వర్ పనిచేయక సర్వే నత్తనడకన సాగుతోంది. అసలు సర్వే ఎందుకుచేస్తున్నారో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. సర్వే సందర్భంగా అడుగుతున్న అంశాలను బట్టి పథకాల్లో కోత విధించేందుకే అని చాలామంది భావిస్తున్నారు.
► చాలాచోట్ల డౌన్లోడ్ కాని యాప్
► నత్తనడకన సాగుతున్న సర్వే
► పనులు మానుకొని ఇళ్ల వద్ద ఎదురుచూస్తున్న ప్రజలు
► పథకాల్లో కోత విధిస్తారని ప్రచారం
చేజర్ల : ప్రజాసాధికారిక సర్వేను ప్రభుత్వం ఈనెల ఈ నెల 8వతేదీన ప్రారంభించింది. ఎన్యూమరేటర్లు ప్రజలకు సంబంధించి పలు అంశాల సమాచారాన్ని ఒకేచోట పొందుపర్చడమే దీని ప్రధాన లక్ష్యం. బ్యాంకు లావాదేవీలు, గృహోకపరణాలైన టీవీ, ఫ్రిజ్, గ్యాస్, సొంతిల్లు, గ్యాస్ సబ్సిడీ, విద్యార్హత వివరాలు ఇలా వివిధ రకాల సమాచారాన్ని సర్వేలో సేకరిస్తారు. దీనికోసం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున యంత్రాగాన్ని ఏర్పాటుచేసింది. 47 మంది ఇన్చార్జ్ అధికారులు, 51 మంది మాస్టర్ ట్రైనర్లు, 176 మంది సూపర్వైజర్లు, 1,487 మంది ఎన్యూమరేటర్లు 1,487 మంది అసిస్టెంట్లు సర్వే చేసేందుకు నియమించబడ్డారు.
ప్రారంభించిన తొలిరోజు నుంచే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వేకు అంతరాయం ఏర్పడుతోంది. యాప్ డౌన్లోడ్ కాక సిబ్బంది ఎంతో ఇబ్బందిపడ్డారు. మొదట 2.1 సాఫ్ట్వేర్ వర్షన్ డౌన్లోడ్ చేయగా అది పనిచేయకపోవడంతో తర్వాత 2.2, 2.3, 2.3.1 ప్రస్తుతం. 2.4.1 వర్షన్లో ప్రయత్నిస్తున్నా యాప్ డౌన్లోడ్ కావడం లేదు. ఒక్కో వ్యక్తిని సర్వేచేసేందుకు ఎన్యూమరేటర్లకు ఇచ్చేది కేవలం రూ.2 మాత్రమే. దీంతో వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
ఎందుకో..?
సర్వే ఎందుకోసం..? ప్రజలందరిలో మెదులుతున్న ప్రశ్న ఇది. సమాచారాన్ని సేకరించడమని చెబుతున్నా ఇందులో మర్మం దాగుందని రాజకీయపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే సర్వేసాగుతోంది. బైక్ ఉందా? లేదా? ఆదాయం ఎంత? ఎవరెవరు ఉద్యోగం చేస్తున్నారు? ఇలా పలు వివరాలు సేకరిస్తుండటంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాల్లో కోత విధించేందుకే సర్వే అనే ప్రచారం ఉంది.
పనిపోయే..
గ్రామాల్లో సర్వే పేదలను ఇబ్బందిపెడుతోంది. క్షేత్రస్థాయి సిబ్బంది ఈ రోజు ఫలానా ఊరికి వస్తాం.. అందుబాటులో ఉండండని ప్రజలకు చెబుతున్నారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఒక్కో ఇంట్లోనే గంటలకొద్ది సమయం పడుతుండటంతో ఎక్కువమందిని సర్వే చేయలేకపోతున్నారు. దీంతో కూలి పనులకు వెళ్తేగానీ పూటగడవని పరిస్థితి దారుణంగా ఉంది. రెండు రోజుల క్రితం ఓ మండలంలోని గ్రామంలో సర్వే ప్రారంభించగా ఒక్క ఇంటి వివరాలు సేకరించేందుకే మధ్యాహ్నమైంది. దీంతో పక్కరోజు సర్వే చేస్తామని అధికారులు చెప్పగా మీవల్ల పనులు పోయాయని కొంతమంది అసంతృప్తి వ్యక్తంచేశారు.
మెరుగైన సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెస్తున్నాం
స్మార్ట్పల్స్ సర్వే విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరో రెండు రోజుల్లో ఎటువంటి ఆటంకాలు లేని మెరుగైన సాఫ్ట్వేర్ అందుబాటులోకి తెస్తాం. సమస్యను పరిష్కరిస్తాం. -ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్
గందరగోళంగా పల్స్ సర్వే
Published Sat, Jul 16 2016 7:15 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement