రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

Published Sun, Feb 5 2017 6:02 PM

constable died in road accident

కనగానపల్లి(అనంతపురం జిల్లా): కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లిలో 44వ జాతీయ రహాదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రేమ్‌ కుమార్‌ అనే కానిస్టేబుల్‌ మృతిచెందాడు. ప్రేమ్‌ కుమార్‌, మరో ఇద్దరు కలిసి స్కార్పియోలో హిందూపూర్‌ నుంచి అనంతపురం వైపు వెళ్తుండగా  గూడ్సులారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ప్రేమ్‌ కుమార్‌ అక్కడకిక్కడే మృతిచెందగా..మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రేమ్‌కుమార్‌ గోరంట్లలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement