గిరిజనులకు టోపీ పెట్టి....! | Sakshi
Sakshi News home page

గిరిజనులకు టోపీ పెట్టి....!

Published Mon, Oct 24 2016 11:36 PM

ఐటీడీఏకు వచ్చిన గ్రానైట్‌ తవ్వకాల అనుకూల వర్గం గిరిజనులు - Sakshi

గ్రానైట్‌ తవ్వకాలకు అనుకూలమంటూ వినతులు
​‍గ్రీవెన్స్‌సెల్‌కు తీసుకొచ్చిన కంపెనీల ప్రతినిధులు 
 
 
పార్వతీపురం: మండలంలోని బోడికొండ, బడేదేవరకొండల్లో గ్రానైట్‌ తవ్వకాలకు అడ్డగోలుగా అనుమతులు పొందిన కంపెనీలు తన కార్పొరేట్‌ తెలివితేటలను ఉపయోగించాయి. దీన్లో భాగంగా సోమవారం స్థానిక ఐటీడీఏలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ నిర్వహించిన గ్రీవెన్స్‌కు కొంతమంది గిరిజనులకు టోపీలు పెట్టి, రంగు రంగుల యూనిఫాం వేయించి,  తమకు గ్రానైట్‌ తవ్వకాలు కావాలనే బ్యానర్లతో ఐటీడీఏ కార్యాలయానికి కంపెనీ ప్రతినిధులు తీసుకొచ్చారు. గ్రానైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఐక్య పోరాట సమితి గిరిజనులు ఐటీడీఏ కు వచ్చేసరికి వీరు పలాయనం చిత్తగించారు. ఆ సమయంలో ఆ కంపెనీ ప్రతినిధి ఆ గిరిజనులను బతిమాలుతూ కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో పోలీసుల అండదండలతో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనుకూల ప్రతికూల వర్గాల మధ్య కొట్లాట జరుగుతుందేమోనని స్థానికులు  ఆందోళన చెందారు. 

Advertisement
Advertisement