– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారుల కీలకపాత్ర!
– కార్డుకు రూ.200 ముట్టజెబుతున్న డీలర్లు
– ఈ–పాస్ విధానం అపహాస్యం
ఈ–పాస్ విధానంతో రేషన్ అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే..ఇదంతా ఉత్తిదే. అక్రమార్కులు ఏదో ఒకవిధంగా కన్నం వేస్తూనే ఉన్నారు. ఈ–పాస్ విధానాన్ని కూడా అపహాస్యం చేస్తూ బోగస్ కార్డులతో భారీఎత్తున రేషన్ కొట్టేస్తున్నారు. ఈ వ్యవహారంలో డీలర్లకు స్వయాన పౌరసరఫరాల శాఖ సిబ్బందే దన్నుగా నిలుస్తుండడం గమనార్హం.
తాడిపత్రి : తాడిపత్రిలో కలకలం రేపుతున్న బోగస్ రేషన్కార్డుల వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని పౌరసరఫరాల శాఖ సిబ్బందే ఈ అక్రమాలకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల్లోని వ్యక్తుల ఆధార్ నంబర్లు మార్చడం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ఈ–పాస్లో ఆధార్ నంబర్ మార్చడం ఆషామాషీ కాదు. పౌరసరఫరాల శాఖ సాంకేతిక అధికారులతోనే ఇది సాధ్యం. దీంతో డీలర్లు హైదరాబాద్లోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయ సిబ్బందితో లింక్ పెట్టుకున్నారు. ప్రతినెలా ఒక్కో బోగస్ కార్డుపై రూ.200 వరకు ఇస్తూ ఆధార్ నంబర్లు మార్పు చేయిస్తున్నారు. వాటి స్థానంలో తమకు సంబంధించిన వారి నంబర్లు నమోదు చేయిస్తున్నారు. వారి వేలిముద్రల ద్వారా సరుకులు తీసుకున్న తర్వాత ముందున్న నంబర్లను యథావిధిగా ఉంచుతున్నారు. ఉదాహరణకు.. నారాయణమ్మ అనే మహిళ పేరు మీద రేషన్ కార్డు ఉంటుంది. కానీ ఆమె సరుకులు తీసుకోదు. ఏదైనా అవసరానికి కార్డు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దాన్ని తీసుకుని ఉంటుంది. ఆమె కార్డుకు సంబంధించిన ఆధార్ నంబర్ల స్థానంలో డీలర్కు చెందిన వారివి నమోదు చేస్తారు. వారితో ఈ పాస్ యంత్రంలో వేలిముద్ర వేయిస్తారు. సరుకులు డ్రా కాగానే మళ్లీ పాతవే ఉంచేస్తారు.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికే తెల్లరేషన్ కార్డులు ఇస్తారు. దాదాపు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఆరోగ్యశ్రీ, ఇతరత్రా వాటికి కార్డు తప్పనిసరిగా మారింది. దీంతో ఉన్నత స్థాయి, మధ్యతరగతి వారు కూడా తెల్లకార్డులు తీసుకుని తమ వద్ద ఉంచుకున్నారు. వీరంతా రేషన్ షాపులకు ఎప్పుడూ వెళ్లరు. తాడిపత్రిలో ఇలాంటి కార్డులు చాలానే ఉన్నాయి. వీటి ద్వారా డీలర్లు ప్రతినెలా నిత్యావసరాలను స్వాహా చేస్తున్నారు. వాటిని నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే వందల క్వింటాళ్ల బియ్యం నల్లబజారుకు తరలుతున్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీంతో ఆలస్యంగా మేల్కొన్న అధికారులు హడావుడి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బందాలతో బోగస్ కార్డులపై విచారణ చేయిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా బోగస్ కార్డులను గుర్తిస్తారా? ఒకవేళ గుర్తించినా ‘అధికార’ ఒత్తిళ్లను అధిగమించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొన్నాళ్లు వేచివుండక తప్పదు.
అంతా హైదరాబాద్ నుంచే..
Published Sat, Oct 22 2016 11:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement