దంపతుల అంత్యక్రియలు పూర్తి | Sakshi
Sakshi News home page

దంపతుల అంత్యక్రియలు పూర్తి

Published Fri, Aug 12 2016 11:59 PM

couple funeral completd

బసంత్‌నగర్‌ : రామగుండం మండలం రామారావుపల్లి గ్రామంలో కొడుకుల చేతిలో దారుణ హత్యకు గురైన దంపతుల అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కొండ గట్టయ్య, అతడి భార్య రాధ మృతదేహాలను ఆమె స్వగ్రామం పాలకుర్తికి తీసుకువచ్చారు. రాధ సోదరుల ఆధ్వర్యంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా గట్టయ్య కూతురు శ్రీలేఖ నిప్పు పట్టింది. గ్రామ శివారులోని శ్మశాన వాటికలో మృతదేహాలను ఖననం చేశారు. మరికొద్ది రోజుల్లో సంతోషంగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన శ్రీలేఖ అకాలంగా తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర శోక సముద్రంలో మునిగిపోవడాన్ని చూసిన స్థానికులు  కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మ, నాన్నలు ఇద్దరు అకాల మరణం చెందడంతో శ్రీలేఖ ప్రస్తుతం అనాథ అయింది. ఈహత్య కొడుకులిద్దరే చేశారా.. ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement