ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్
అనంతపురం రూరల్: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దోచుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్న చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పిలుపు నిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన టీడీపీ సర్కార్ చర్యలను నిరిసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా ఆపార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించారు. రూరల్ మండల కార్యదర్శి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో జగదీష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రూ.2 కే రక్షిత తాగునీరు, ఇంటికో ఉద్యోగం, రూ.5 కే భోజనం అందిస్తామన్న హామీలన్నీ గాలిలో కలిసిపోయాయన్నారు.
అనంతపురం రూరల్ మండలంలో ఇళ్ల స్థలాలు, ఎన్టీఆర్ ఇళ్ల కోసం వేలాది మంది నిరుపేదలు ఎదురు చూస్తున్నా...నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పరిటాల సునీత పట్టించు కోవడం లేదన్నారు. కేవలం తనవారికి లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తున్న మంత్రికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం అసన్నమైందన్నారు. సంక్షేమ పథకాలన్నీ అధికార పార్టీ నాయకులకే అందుతున్నాయనీ, అర్హులైన నిరుపేదలంతా కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారన్నారు. రైతు సంఘం నాయకులు మల్లికార్జున, కాటమయ్యలు మాట్లాడుతూ, హంద్రీ నీవా కాలువ నుంచి పీఏబీఆర్ డ్యాంకు 3 టీఎంసీల నీటిని కేటాయించి కుడికాలువ కింద ఉన్న ప్రతి చెరువును పూర్తి స్థాయిలో నింపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం నాయకులు కాటమయ్య, కేశవరెడ్డి, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి, చంద్రకళ, రఘురామయ్య, వెంకటనారాయణ, రాప్తాడు కార్యదర్శి నాగరాజు, వన్నారెడ్డి, చియ్యేడు రామకృష్ణ, అప్పిరెడ్డితోపాటు పెద్ద ఎత్తున శ్రేణులు పాల్గొన్నారు.
చంద్రబాబు పాలనకు చరమగీతం పాడుదాం
Published Tue, Aug 1 2017 9:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement