‘కష్టజీవులను కష్టాల్లోకి నెట్టారు’ | Sakshi
Sakshi News home page

‘కష్టజీవులను కష్టాల్లోకి నెట్టారు’

Published Mon, Nov 14 2016 12:42 AM

cpi stage ptrotest in anantapur

అనంతపురం అగ్రికల్చర్‌:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్న ఫలంగా రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేసి కష్టజీవులను కష్టాల్లోకి నెట్టేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్‌ మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం స్థానిక సాయినగర్‌లోని స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నోట్ల రద్దు కార్పొరేట్‌ సంస్థలు, సంపన్న వర్గాలకు కొమ్ముకాసేలా ఉందని, కేవలం సామాన్య వర్గాలపై తమ ప్రతాపాన్ని చూపిం చారని విమర్శించారు. నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి కల్పించారని ఆందోâýæన వ్యక్తం చేశారు. రూ.2 వేల నోట్లు రద్దు చేసి, కొత్తగా రూ.100, రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద ఎత్తున సరఫరా చేసి తక్షణం ప్రజలకు అందజేయాలని డిమాండ్‌ చేశారు.
 

Advertisement
Advertisement