ముఖం చాటేసిన సీఆర్‌డీఏ అధికారులు | Sakshi
Sakshi News home page

ముఖం చాటేసిన సీఆర్‌డీఏ అధికారులు

Published Mon, Oct 17 2016 6:44 PM

CRDA officials escapes after farmers questions about lands

గుంటూరు: అనంతవరం రైతులకు సీఆర్‌డీఏ అధికారులు ముఖం చాటేశారు. తుళ్లూరు మండలం అనంతవరంలో రికార్డులు తారుమారు చేసి, సెంట్ల రూపంలో టీడీపీ నేతలు కొట్టేశారు. దీంతో నిజమైన రైతుల భూములు కోల్పేయే అవకాశం ఉంటడంతో నిలదీస్తారనే భయంతో సీఆర్‌డీఏ అధికారులు ముఖం చాటేశారు. సోమవారం ఉదయం సీఆర్‌డీఏ కార్యాలయానకి వెళ్లి రైతులు నిలదీశారు. రైతులకు సమాధానం చెప్పలేక, కార్యాలయానికి తాళం వేసి సీఆర్‌డీఏ అధికారులు వెళ్లిపోయారు. అధికారుల కోసం రోజంతా రైతులు వేచి చూశారు.

Advertisement
Advertisement