విజిలెన్స్‌ అదుపులో దళారీ.. | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ అదుపులో దళారీ..

Published Sat, Dec 26 2015 8:25 PM

Dalari custody in Vigllience officials

తిరుమల: తిరుమల తిరుపతిలో శనివారం ఓ దళారీని విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి ఫేక్‌ దర్శనాలు, వైకుంఠ ఏకాదశి టికెట్లు, తిరుప్పావడ సేవా టికెట్లను బ్లాక్‌లో విక్రయించినట్టు మల్లికార్జున్‌ అనే దళారీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బోర్డు సభ్యుడు సాయన్న సిఫారసు లేఖపై మల్లికార్జున్‌ టిక్కెట్లను పొందినట్టు తెలిసింది.

ఈ టిక్కెట్ల విక్రయంలో దళారీకి బోర్డు సభ్యుడు సాయన్న పీఆర్వో నాగరాజు కూడా సహాకరించినట్టు తమ విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. దాంతో దళారీ మల్లికార్జున్‌ను తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించినట్టు విజిలెన్స్‌ అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement