► ఎడారి దేశంలో కష్టాలు..
► స్వదేశానికి క్షేమంగా చేరుకున్న దీన
► ‘సాక్షి’కథనమే చేర్చింది
యానాం (ముమ్మిడివరం) : ‘ఎడారి దేశంలో కష్టాలు ఎదుర్కొన్నాను.. స్వదేశానికి పంపండని వేడుకున్నందుకు వారితో దెబ్బలు తిన్నాను. తిండి, నిద్ర లేదు. ప్రాణాలపై ఆశలు వదులుకున్నాను. అయితే మే 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ప్రాణాలను నిలిపి.. స్వదేశానికి తిరిగివచ్చేలా చేసింది. నా కుమార్తె, కుమారుడి వద్దకు చేర్చింది. ఆ కథనం నాడు మరో జన్మను ఇచ్చింది. ‘సాక్షి’ పత్రికకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను?’... ఏజెంట్ మోసానికి గురై దుబాయ్కు విజిటింగ్ వీసాపై వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన దరియాలతిప్ప గ్రామానికి చెందిన సంగాడి దీన విలపిస్తూ చెప్పిన మాటలివి.
ఏప్రిల్ 28న దుబాయ్ వెళ్లిన ఆమె తిరిగి క్షేమంగా గురువారం తెల్లవారుజామున దరియాలతిప్ప చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, తనను ఉంచిన ప్రదేశంలో వందలాది మంది తెలుగు వాళ్లు, శ్రీలంక, ఫిలిప్పిన్స్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారని తెలిపింది. అక్కడ పని దొరుకుతుందనే ఆశతోనే అందరూ వెళుతున్నారని, అయితే పని దొరకడం లేదని చెప్పింది.
తమను ఒక ఇంట్లో ఉంచిన అనంతరం యూఏఈలోని అజ్మాన్ అనే ప్రాంతంలో.. అల్వాసెట్ అనే లేబర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కార్యాలయానికి చేర్చేవారని చెప్పింది. అందరినీ గదులలో బంధించేవారని, పనిలో చేరేందుకు వచ్చిన మహిళలు దుర్భర పరిస్ధితులలో ఉంటున్నారని వివరించింది. సెల్ఫోన్ తీసేసుకుంటారని, ఆఖరికి టీ తాగాలన్నా వాళ్ల అనుమతి ఉండాలని, తిన్నారో లేదో అడిగేవారు కూడా లేరని వాపోయింది. అనంతమైన ఎడారిలో కొన్ని ఇళ్లు మాత్రమే ఉండేవని తెలిపింది.
విజిటింగ్ (టూరిస్ట్) వీసా కాలపరిమితి జూన్ 10లోగా ముగిసిపోతుందని, పని దొరకని పరిస్థితిలో వేధింపులు భరించలేకపోయానని వాపోయింది. ఏజెంట్ వాతాడి సత్యనారాయణ తనకు వర్కింగ్ వీసా అని చెప్పి విజిటింగ్ వీసాపై పంపడం వల్లే మోసపోయానని ఆరోపించింది. తన పరిస్థితిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అక్కడి వారు ఈ విషయం ఏజెంట్ ద్వారా తెలుసుకుని తనను స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపింది. ఈ సమస్యపై స్పందించిన పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితర అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
ప్రాణాలతో వస్తాననుకోలేదు..
Published Fri, Jun 2 2017 1:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement