► వెనుకడుగు వేసిన ప్రభుత్వం
► జిల్లాలో ఇప్పటికి 81.09 శాతమే నమోదు
► ఊపిరి పీల్చుకున్నఅదికారులు
► వందశాతం పూర్తి ఎప్పటికో?
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం ఎంత తొందర పెట్టినా.. అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినా ప్రజాసాధికార సర్వే జిల్లాలో శతశాతం పూర్తి కాలేదు. పొట్టకూటి కోసం జనం వలస బాట పట్టడంతో ఇప్పటివరకు 81.09 శాతం మాత్రమే పూర్తరుుంది. నిర్దేశిత గడువు పూర్తి కావడంతో ప్రస్తుతం ఇంటింటి సర్వేను అధికారులు తాత్కాలికంగా ఆపారు. ప్రజల నుంచి సహకారం లేకపోవడం, అధికార వర్గాల నుంచి లోలోపల వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం కూడా దీనిపై ఒత్తిడి తగ్గించింది. దీంతో శతశాతం పూర్తి కావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నారుు. ప్రజల పూర్తి వివరాలు సేకరించడానికి ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే చేపట్టిన విషయం విదితమే. ఇందులోభాగంగా జిల్లాలో జులై 8వతేదీన ఈ సర్వే ప్రారంభమైంది. ఆరంభంలో ఆ నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించిన ప్రభుత్వం తర్వాత అనేక పర్యాయాలు వారుుదాలు వేసుకుంటూ వచ్చింది. చివరిగా గత నెలలో మాత్రం అధికారులపై ఒత్తిడి పెంచింది. నవంబరు నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించింది. ఈమేరకు మండలస్థారుు అధికారులు, ఎన్యుమరేటర్లుపై జిల్లా అధికారులు తీవ్ర ఒత్తిడి పెంచారు. వలస వెళ్లిన వారినిసైతం తెప్పించి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పరిస్థితుల్లో అధికారులు కూడా సర్వే చేయడం లేదు. మరో వైపు నగదు రహిత లావాదేవీలపై ప్రచారం కోసం ప్రభుత్వం అధికారులను పురమారుుంచడంతో సర్వే పనిని ప్రస్తుతం వారు చేయడం లేదు. అరుుతే తదుపరి కూడా ప్రత్యేకించి సర్వే ఉండదని అధికారులు చెబుతున్నారు. నిరంతర పక్రియ అరుునా వచ్చిన వారికి మాత్రమే నమోదు చేసే అవకాశముందంటున్నారు. సెంట్రలైజ్ చేసి ఏదో ఒక కేంద్రంలో నమోదు చేస్తారని ఒక అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు అమరావతిలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిన విషయం విదితమే. ప్రజలు, అధికారుల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సర్వేపై వెనుకడుగు వేసి తదుపరి గడువు తేదీలు చెప్పకుండా వదిలేసినట్లు కొందరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యం లో శతశాతం సర్వే ఎప్పటికి పూర్తి కానుందోనన్న ప్రశ్న ఇంకా అలాగే మిగిలిఉంది.
సర్వేకు అందని ప్రజా సహకారం
Published Sat, Dec 3 2016 2:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement