- టీటీటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓకు ఫిర్యాదు
ఖమ్మం: కొత్తగూడెం జిల్లా ఉప విద్యాశాఖాధికారి (డిప్యూటీ ఈఓ) వెంకటనర్సమ్మ ఉపాధ్యాయులను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని, చాలా ఇబ్బంది పడుతున్నామని తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ (టీటీటీఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలో డీఈఓ నాంపల్లి రాజేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్నాయక్ మాట్లాడుతూ..డివిజన్లో ఆమె ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మహిళా టీచర్లను చాలా ఇబ్బంది పెడుతున్నారని, వేధింపులతో భయపెడుతున్నారని తెలిపారు. గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నా..ఇంకా తీరు మారలేదని, స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.