డిప్యూటీ ఈఓ వేధింపులు భరించలేం | Sakshi
Sakshi News home page

డిప్యూటీ ఈఓ వేధింపులు భరించలేం

Published Wed, Jul 27 2016 11:27 PM

Deputy EO harassment bharincalem

  • టీటీటీఎఫ్‌ ఆధ్వర్యంలో డీఈఓకు ఫిర్యాదు
  •  
    ఖమ్మం: కొత్తగూడెం జిల్లా ఉప విద్యాశాఖాధికారి (డిప్యూటీ ఈఓ) వెంకటనర్సమ్మ ఉపాధ్యాయులను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని, చాలా ఇబ్బంది పడుతున్నామని తెలంగాణ ట్రైబల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీటీటీఎఫ్‌) ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలో డీఈఓ నాంపల్లి రాజేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్‌ మాట్లాడుతూ..డివిజన్‌లో ఆమె ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మహిళా టీచర్లను చాలా ఇబ్బంది పెడుతున్నారని, వేధింపులతో భయపెడుతున్నారని తెలిపారు. గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నా..ఇంకా తీరు మారలేదని, స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement