వాడపల్లిలో పుష్కర స్నానానికి బారులు తీరిన భక్తులు | Sakshi
Sakshi News home page

వాడపల్లిలో పుష్కర స్నానానికి బారులు తీరిన భక్తులు

Published Sun, Aug 14 2016 9:45 AM

devotees heavy rush in vadapalli due to pushkar ghat

వాడపల్లి: కృష్ణా పుష్కరాల మూడో రోజుకే చేరుకున్నాయి. వరుస సెలవులు కావడంతో.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. పుష్కర స్నానాలు ఆచరించడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. దక్షిణ కాశీగా పేరుగాంచిన వాడపల్లి జనసంద్రమైంది. కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రాంతంగా వాడపల్లి విరాజిల్లుతుండటంతో.. ఇక్కడ పుష్కర స్నానం చేయడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement
Advertisement