తిరుమలలో తగ్గని రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గని రద్దీ

Published Tue, May 24 2016 8:42 AM

devotees rush in Tirumala

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.


శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాల్‌గౌడ్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయమర్యాదల ప్రకారం అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.

 

Advertisement
Advertisement