బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు జిల్లా విద్యార్థులు | Sakshi
Sakshi News home page

బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు జిల్లా విద్యార్థులు

Published Tue, Sep 6 2016 9:45 PM

బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు జిల్లా విద్యార్థులు

మాదల (ముప్పాళ్ళ): మండలంలోని మాదల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్‌ మహమ్మద్‌ రియాజ్‌ మంగళవారం తెలిపారు. గుంటూరులో ఆదివారం బాల్‌బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి (అండర్‌–19) విభాగంలో జరిగిన పోటీలలో ప్రతిభ కనపరిచినట్లు తెలిపారు. పాఠశాలలోని పదోతరగతికి చెందిన గోగుల మౌనిక, యనమదల మంజులు రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైనట్లు చెప్పారు. వీరు ఈ నెల 23, 24, 25 తేదీలలో కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. వీరిరువురిని పాఠశాల ప్రధానోపా«ధ్యాయుడు జె.లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement