►సుమారు రూ.5 కోట్ల మేర రికవరీకి కసరత్తు
►మొదటగా 85 చెక్కుల మతలబుపై నివేదిక
►రకరకాల ప్రణాళికలతో దోచేసిన వైనం
►22 చార్జిషీట్లు నమోదు చేసిన అధికారులు
►ప్రభుత్వానికి చేరినా.... వేటులో తాత్సారం
సాక్షి, కడప : గండికోట పరిహారం పంపిణీ విషయంలో జరిగిన అవకతవకలు ప్రస్తుతం అధికారులను వెంటాడుతున్నాయి. ఆర్డీఓ వినాయకంతోపాటు తహసీల్దార్లు, కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది వరకు చేసిన తప్పులకు ఎలాంటి శిక్ష పడుతుందోనన్న ఆందోళన అందరినీ వెంటాడుతోంది. ఇచ్చిందే చెక్కు..çపంచిందే పరిహారం అన్న తరహాలో అధికారులు అడిగేవారు ఉండరన్న తరహాలో ముందుకు వెళ్లారు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందిలే, అవకతవకల వ్యవహారం కూడా బయటికి పొక్కదని భావించి ఎవరికి వారు వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులోనూ గండికోట పరిహారం విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టారు. జేసీ–2 శివారెడ్డి నేతృత్వంలో పరిహారం పంపిణీపై కూలంకషంగా విచారణ జరగ్గా, మరోపక్క ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా కూడా విచారణ చేయించి అవకతవకలను తేల్చారు. గండికోట పరిహారం పంపిణీలో దాదాపు రూ.70 నుంచి రూ.75కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించారు.
85 చెక్కులు..22 చార్జిషీట్లు
గండికోట ప్రాజెక్టు పరిధిలోని కొండాపురం, ముద్దనూరు మండలాల్లోని 21 గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా గుర్తించి తొలుత 14 గ్రామాల్లోని 9,098 కుటుంబాలకు రూ.479కోట్ల పరిహారం మంజూరు చేసి పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే పంపిణీలో ఇష్టానుసారంగా అనుకూలురు, ఇతర దళారులతో కుమ్మక్కై కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడ్డారు. ఒకే ఇంటిలో ఉన్న భార్యాభర్తలకు సంబంధించి విడిపోయినట్లు సర్టిఫికెట్లు సృష్టించడం మొదలుకొని, మైనర్లు మేజర్లుగా చూపించడం వరకు చాలా అవకతవకలు చేశారు. అంతేకాకుండా స్థానికేతరులకు సైతం చెక్కులు అందినట్లు విచారణలో నిగ్గుతేలింది. పరిహారానికి సంబంధించి అప్పట్లో అధికారులకు ఇచ్చిన రేషన్కార్డును ప్రస్తుతం ఆన్లైన్లో చూస్తే సంబంధిత పరిహారం తీసుకున్న వారి పేరు బదులు మరోపేరు కనిపిస్తుండడం లాంటి ఎన్నో వింతలు, విశేషాలు కనిపించాయి. పెద్ద ఎత్తున అవినీతి విచారణలో వెలుగుచూడడంతో జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించారు. ఆర్డీఓతోపాటు కొంతమంది కిందిస్థాయి అధికారులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్లు విచారణలో తేలిన నేపథ్యంలో కలెక్టర్ కూడా ప్రభుత్వానికి కూలంకషంగా నివేదిక సమర్పించారు. రెవెన్యూపరంగా రికార్డు చేసిన దాదాపు 22 చార్జిషీట్లను నమోదు చేయడంతోపాటు 85 చెక్కుల విషయంలో అవకతవకలను నిర్ధారించారు.
రూ.5కోట్ల రికవరీకి నివేదిక
85 చెక్కులను పక్కదారి పట్టించిన నేపథ్యంలో సంబంధిత అధికారులతోపాటు తీసుకున్న లబ్ధిదారుల నుంచి రికవరీ చేయాలని కోరారు. మొదటగా రూ.5 కోట్ల రికవరీకి ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తదుపరి చర్యలకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా రికవరీ విషయంలో తటపటాయించినా, తీసుకున్న సొమ్ము ఇవ్వకుండా కథలు చెప్పే వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే ఆలోచనలో కూడా జిల్లా యంత్రాంగం ఉంది.
సచివాలయంలో ఏం జరుగుతోంది?
అవకతవకల ఫైలు సచివాలయం చేరినా చర్యలు తీసుకునేం దుకు అధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారన్నది అర్థం కావడం లేదు. పరిహారం సొమ్మును పక్కదారి పట్టించిన కీలక అధికారి తన పలుకుబడితో నివేదికను తొక్కిపెట్టేలా చేస్తున్నారని విమర్శలున్నాయి. గండికోట విషయంలో ఎందుకు నాన్చుతున్నారో ప్రభుత్వ పెద్దలకే ఎరుక!
గండికోట ‘గండం’
Published Fri, Sep 8 2017 3:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement