జిల్లా ఖోఖో జట్టు కెప్టెన్‌గా శిరీష | Sakshi
Sakshi News home page

జిల్లా ఖోఖో జట్టు కెప్టెన్‌గా శిరీష

Published Mon, Sep 12 2016 12:15 AM

District khokho captain Sirisha

దుగ్గొండి: వరంగల్‌ జిల్లా ఖోఖో జట్టు కెప్టెన్‌గా మండలంలోని మహ్మదాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ముద్రబోయిన శిరీష ఎంపికైనట్లు పీఈటీ కోట రాంబాబు తెలిపారు. ఇటీవల జేఎన్‌ఎస్‌లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్‌ – 17 విభాగంలో ఆమె ప్రతిభ కనబర్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి రంగారెడ్డి జిల్లాలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు కెప్టెన్‌గా శిరీష వ్యవహరిస్తారన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement