కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం

Published Fri, May 5 2017 11:40 PM

district level meeting in neelakantapuram

మడకశిర : జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు కృషి చేయాలని పీసీసీ చీఫ్‌ ఎన్‌ రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో జిల్లాలోని 14 నియోజకవర్గాల కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు కష్టపడి పని చేస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. ఈ సందర్బంగా జిల్లాలో పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్‌తో పాటు వివిధ నియోజకవర్గాల కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement