జిల్లా అండర్–14 బాలబాలికల జట్లు వెల్లడి
16 నుంచి విజయవాడలో రాష ్టస్కూల్గేమ్స్ టీటీ పోటీలు
శ్రీకాకళం న్యూకాలనీ: విజయవాడ కేంద్రంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–14 బాలబాలికల టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పూర్తయింది. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను జిల్లా పాఠశాలల క్రీడల సమాఖ్య అధ్యక్షులు, డీఈఓ డి.దేవానందరెడ్డి, కార్యదర్శి ఎమ్మెస్సీ శేఖర్లు వెల్లడించారు. గతనెల 30, 31 తేదీల్లో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను తుదిజట్లకు ఎంపిక చేసినట్టు స్పష్టం చేశారు. ఈ జట్లకు కోచ్, మేనేజర్లగా పీఈటీలు ఎం.త్రినాథ్ (జెడ్పీహెచ్స్కూల్, బొండపల్లి), డి.భవానీ (జెడ్పీహెచ్స్కూల్ మాకివలస)లను నియమించినట్లు పేర్కొన్నారు.
15న ఇక్కడ నుంచి పయనం..
జిల్లా స్కూల్గేమ్స్ అండర్–14 టీటీ జట్లు ఈనెల 15న (గురువారం) ఇక్కడ నుంచి ప్రయాణమై వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారుంతా ఆ రోజు ఉదయం 8 గంటలకు తమ లగేజీతో పాటు నాలుగు అర్హత ధ్రువీకరణ పత్రాలు, ప్రస్తుతం చదువుతున్న స్టడీ సర్టిఫికెట్, గత ఏడాది మార్క్స్ మెమో, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫొటోలతో శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్కు చేరుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్:94400 01616 (శేఖర్) నంబర్ను సంప్రదించాలని సూచించారు.
జిల్లా జట్ల వివరాలు..
బాలుర జట్టు: వీఎం ఫరజ్ఖాన్, డి.ధరణిదర్నాయుడు (సెయింట్జోషప్స్ స్కూల్, శ్రీకాకుళం), బి.సూర్యప్రకాశ్ (జెడ్పీహెచ్ స్కూల్ జి.సిగడాం), పి.దివాకర్ (జెడ్పీహెచ్ స్కూల్, పొన్నాడ), ఆర్.శేఖర్ (జెడ్పీహెచ్ స్కూల్ మాకివలస).
బాలికల జట్టు: బి.కవిత, పి.శ్రావణి, పి.గాయత్రి, పి.ప్రశాంతి (జెడ్పీహెచ్ స్కూల్ ఫరీదుపేట), ఎస్.వెంకటలక్ష్మి (జెడ్పీహెచ్ స్కూల్, పొన్నాడ)లు ఎంపికైన వారిలో ఉన్నారు.