చంద్రబాబు హామీలకు మోసపోవద్దు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హామీలకు మోసపోవద్దు

Published Wed, Jul 26 2017 1:57 AM

చంద్రబాబు హామీలకు మోసపోవద్దు - Sakshi

నంద్యాలఅర్బన్‌: మాయమాటలతో గారడీ చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలకు  మోసపొవద్దని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి ఓటర్లకు సూచించా రు. మూడేళ్ల కిత్రం అధికారంలోకి రావడానికి వందల అబద్ధాలు చెప్పిన బాబు నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టి తద్వారా ఓట్లను దండుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలిపించేందుకు ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని పాణ్యం ఎమ్యెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి మంగళవారం పట్టణంలోని 37వ వార్డు రామాలయం, సంజీవనగర్‌ గేట్‌ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో గౌరు వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మూడేళ్లలో నంద్యాల అభివృద్ధిని పట్టించుకోని బాబు ఉప ఎన్నికల సమయంలో అభివృద్ధి మంత్రం జపించడాన్ని ఓటర్లు గమనిస్తున్నారన్నారు. నెరవేరని వాగ్దానాలను ఇస్తున్న బాబును నమ్మొద్దని కోరారు. వీరి వెంట పార్టీ నాయకులు యూసుఫ్‌ బాషా, శేఖర్, మాబుపీర్‌ నందమూరినగర్‌ బాషా, సర్దార్, వెంకటేశ్వర్లు ఉన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement