తాగునీటి సమస్య తీర్చాలి | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య తీర్చాలి

Published Thu, Aug 18 2016 12:35 AM

తాగునీటి సమస్య తీర్చాలి

హాలియా : మండలంలోని రాజవరం గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గ్రామంలో మహిళలు బుధవారం పశువుకు వినతిపత్రం సమర్పించారు. అధికారులు వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని లేదంటే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామన్నారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రమణ, సరస్వతి, మీరాభి, మైబు, చినఅంజయ్య, కోటమ్మ, శ్రీను, శివ గ్రామస్తులు పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement