అనంతపురం అగ్రికల్చర్: అర్హులైన రైతులందరికీ డ్రిప్ యూనిట్లు అందించడానికి వీలుగా వచ్చే వారంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక పరిశీలన (పీఐఆర్) చేపట్టాలని ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఏపీడీలు ఆర్.విజయశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్, ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఎంఐ ఇంజనీర్లు, ఎంఐఏఓలు, కంపెనీ డీసీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించిన డ్రిప్ రిజిష్ట్రేషన్ వారోత్సవాల్లో వచ్చిన 12 వేల దరఖాస్తులను మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాథమికంగా అన్ని అంశాలు పరిశీలించి అర్హత జాబితా సిద్ధం చేయాలన్నారు. ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు జిల్లా అంతటా పీఐఆర్ వారోత్సవాలు చేపట్టాలని ఆదేశించారు.
బోర్లలో నీళ్లు వస్తున్నట్లు రైతుల ఫొటోతో పీఐఆర్ జాబితా తయారు చేయాలన్నారు. మరోపక్క రిజిష్ట్రేషన్ల నమోదు కొనసాగించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 85,134 హెక్టార్లకు డ్రిప్ కోసం ఆన్లైన్ రిజిష్ట్రేషన్లు చేసుకోకగా, అందులో అనంతపురం జిల్లాలో 31,340 హెక్టార్లకు రైతులు రిజిస్ర్టేషన్ చేసుకున్నారన్నారు. ఈ సంఖ్యను ఇంకా పెంచగలిగితే ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించడానికి వీలవుతుందన్నారు. ఈ ఏడాది 31,750 హెక్టార్లకు డ్రిప్ యూనిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1,667 మంది రైతులకు 2,011 హెక్టార్లకు సరిపడా డ్రిప్ యూనిట్లు మంజూరు చేశామన్నారు. 2016–17కు సంబంధించి మంజూరు చేసి, ఇన్స్టాల్ చేసిన డ్రిప్ యూనిట్లకు చివరి పరిశీలన నివేదిక (ఎఫ్ఐఆర్) సమర్పించాలని ఆదేశించారు.
అర్హులందరికీ డ్రిప్ యూనిట్లు
Published Sat, Jul 22 2017 9:41 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement