ఆటో అదుపుతప్పి డ్రైవర్‌ మృతి | Sakshi
Sakshi News home page

ఆటో అదుపుతప్పి డ్రైవర్‌ మృతి

Published Mon, Jul 18 2016 12:06 AM

ఆటో అదుపుతప్పి డ్రైవర్‌ మృతి - Sakshi

లక్సెట్టిపేట : మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన తగరపు రాజయ్య(25) అనే ఆటో డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. అతడు నడుపుతున్న ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో చనిపోయినట్లు స్థానిక ఎస్‌హెచ్‌వో లింగంపల్లి భూమేశ్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాజయ్య ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. శనివారం సాయంత్రం మంచిర్యాలకు వెళ్లాడు. ఆదివారం ఉదయం మంచిర్యాల నుంచి లక్సెట్టిపేటకు తిరిగి వస్తున్నాడు. లక్సెట్టిపేట మండలంలోని శాంతాపూర్‌ స్టేజీ వద్ద ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాజయ్య అక్కడికక్కడే మతిచెందాడు. మతుడి అన్న భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement