బిలియర్డ్స్‌లో దుర్గాప్రసాద్‌కు స్వర్ణం | Sakshi
Sakshi News home page

బిలియర్డ్స్‌లో దుర్గాప్రసాద్‌కు స్వర్ణం

Published Wed, Aug 31 2016 8:26 PM

బిలియర్డ్స్‌లో దుర్గాప్రసాద్‌కు స్వర్ణం

విజయవాడ స్పోర్ట్స్‌ :
చెన్నైలో జరుగుతున్న ఆల్‌ ఇండియా రైల్వే బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్స్‌ చాంపియన్‌షిప్‌లో విజయవాడ రైల్వే డివిజన్‌ క్రీడాకారుడు ఎల్‌.దుర్గాప్రసాద్‌ బిలియర్డ్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించాడు. ఆయన ఫైనల్లో సదరన్‌ రైల్వేకి చెందిన రిఫత్‌ అలీపై విజయం సాధించి స్వర్ణం కైవసరం చేసుకున్నాడు. దక్షిణ మధ్య రైల్వే ఇంటర్‌ డివిజనల్‌ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌లో కూడా దుర్గాప్రసాద్‌ స్వర్ణపతకం సాధించాడు. దుర్గాప్రసాద్‌ను డీఆర్‌ఎం అశోక్‌కుమార్, ఏడీఆర్‌ఎం కె.వేణుగోపాలరావు, డివిజనల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ జె.ప్రదీప్‌కుమార్‌ అభినందించారు. 
 

Advertisement
Advertisement