నాతవరం, న్యూస్లైన్ : డ్వాక్రా సభ్యులను మోసగించి వారి సొత్తును ఓ ఉద్యోగి స్వాహా చేసిన ఉదంతం అధికారుల విచారణలో వెలుగు చూసింది. తమను నమ్మించి రూ.లక్షలు స్వాహా చేసిన సీఏ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని శ్రీనందేశ్వర గ్రామైక్య సంఘం సభ్యులు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఏ స్వాహా చేసిన సొమ్ముపై విచారణ జరపాలని వారం రోజుల క్రితం డ్వాక్రా సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై మూడు రోజులుగా సీసీ నాగ్వేరరావు విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఏపీఎం శివప్రసాద్ సోమవారం గ్రామంలో కొన్ని డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. మండలంలో గన్నవరం పంచాయతీ శివారు వై.బి.పట్నంలో 29 డ్వాక్రా సంఘాలున్నాయి. ఇక్కడ సీఏగా పనిచేస్తున్న టి.అప్పారావు ఓబీలు, డ్వాక్రా సంఘాల సభ్యులను తప్పుదోవ పట్టించి స్త్రీనిధి పథకం ద్వారా సభ్యులకు మంజూరైన మొత్తం సొమ్ములో సుమారు రూ. 2 లక్షలు స్వాహా చేశారని ఏపీఎం శివప్రసాద్, సీసీ నాగేశ్వరరావుకు మహిళలు ఫిర్యాదు చేశారు.
ఈ గ్రామంలో స్త్రీనిధి పథకం ద్వారా వివిధ గ్రూపులకు నిధులు విడుదల చేసినట్టు రికార్డుల్లో ఉన్న విషయాన్ని వారు ఏపీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవంగా రికార్డుల్లో ఉన్నదానికి, సభ్యులకు ఇచ్చిన దానికి పొంతన లేకుండా ఉందని తెలిపారు. ఈ సభ్యులకు మే నెలలో సుమారు రూ.7.75 లక్షల రుణాలు ఇచ్చినట్టు చూపించి సభ్యులకు ఆ మొత్తాన్ని ఇవ్వకుండా స్వాహా చేసినట్టు వారు ఆరోపించారు. కొం దరి పేరున రుణాలు మంజూరు చేసి వారికి పూర్తిగా ఇవ్వకుండా సగం సొమ్ము స్వాహా చేశారని తెలిపారు.
రుణాలు ఇవ్వాలంటే ప్రతి గ్రూపూ లంచాలు ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. తాము రుణాలకు వడ్డీ చెల్లిస్తున్నా సీఏ ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా కాజేశారని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఏపీఎం మాట్లాడుతూ సీఏ అప్పారావు నిబంధనలు ఉల్లంఘించి పనిచేసిసట్టు తమ దృష్టికి వచ్చిందని, అతనిని విధుల నుంచి తప్పించి స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు.
డ్వాక్రా సభ్యుల సొమ్ము స్వాహా
Published Tue, Aug 6 2013 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
Advertisement