మిర్యాలగూడ టౌన్ : మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను చెల్లించడంలో అధికారులు, పాలక మండలి నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి కార్మికులు తాళం వేశారు. అధికారులు, సిబ్బంది కార్యాలయంలోకి వెళ్లకుండా సుమారు 4 గంటల పాటు అడ్డుకోగా చెట్ల కిందనే ఉద్యోగులు కూర్చున్నారు. కాగా కార్మికులు చేపట్టిన ఆందోళనకు సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డితో పాటు కాంగ్రెస్, సీపీఎం, సీఐటీయూ, డీవైఎఫ్ఐ సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గత 7 నెలలుగా కార్మికులకు వేతనాలను కాంట్రాక్టర్ ఇవ్వకపోవడంతో అప్పులను తీసుకొచ్చి జీవనం గడుపుతున్నారన్నారు. కార్మికుల వేతనాల విషయంపై రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో పాటు జిల్లా కలెక్టర్ల దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. వెంటనే కార్మికులకు వేతనాలను చెల్లించాలని చెప్పినప్పటికి అధికారులు, పాలక మండలి కార్మికుల వేతనాలను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ సీ. సత్యబాబు మాట్లాడుతూ కార్మికుల వేతనాలపై ఉన్నతాధికారులకు నివేదికను అందజేశామన్నారు. ప్రస్తుతం ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వేతనాలను ఇస్తామన్నారు. దసరా పండుగ వరకు ఐదు నెలల వేతనాలను చెల్లించేందుకు అధికారుల నుంచి అనుమతి రాగానే తక్షణమే చెల్లిస్తామని అన్నారు. దీంతో కార్మికులు ఆందోళనను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, కాంగ్రెస్, సీఐటీయూ, డీవైఎఫ్ఐ నాయకులు డబ్బీకార్ మల్లేష్, ధీరావత్ స్కైలాబ్నాయక్, పగిడి రామలింగయ్య, వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీశ్వర్రెడ్డి, చంద్రశేఖర్యాదవ్, మల్లు గౌతమ్రెడ్డి, ఖరీం, శిరసనగండ్ల ఈశ్వరాచారి, మహ్మద్బిన్ సయ్యద్, రాంమూర్తి, సత్యనారాయణరావు, సోమయ్య, ఎం, రవినాయక్, రాధాకృష్ణ, వహిద్ తదితరులున్నారు.
వేతనాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
Published Mon, Sep 26 2016 9:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement