మరణంలోనూ వీడని స్నేహం | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని స్నేహం

Published Fri, Aug 26 2016 12:33 AM

మరణంలోనూ వీడని స్నేహం - Sakshi

నంద్యాల:మృత్యువు కూడా వారి స్నేహాన్ని విడదీయలేకపోయింది. నంద్యాల – నందికొట్కూరు రహదారిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మత్యుఒడి చేరారు.  గడివేముల మండలం కొరటమద్ది గ్రామానికి చెందిన బాలశేఖర్‌(26), సతీష్‌కుమార్‌(24) చిన్ననాటి స్నేహితులు. బాలశేఖర్‌ బొమ్మలసత్రంలోని మార్కెట్‌ ఫెడ్‌లో ఉద్యోగం చేస్తుండగా, సతీష్‌  డిగ్రీ చదువుతున్నాడు. వీరిద్దరూ గురువారం సాయంత్రం బైక్‌పై పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యంలో పోలూరు గ్రామం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో సతీష్‌కుమార్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలశేఖర్‌ను స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగే స్నేహిలిద్దరూ ఒకేసారి మృతి చెందడం కొరటమద్దిలో విషాదం నెలకొంది. ఒక్కగానొక్కS కుమారుడు సురేష్‌ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలశేఖర్‌కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. మరికొద్ది రోజులోల పెళ్లి కావాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రూరల్‌ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. రోడ్డు ప్రమాదంకు కారణాలు తెలియడం లేదని, యువకులిద్దరూ బైక్‌పై నుంచి అదుపు తప్పి కిందపడ్డారా.., ఏదైనా వాహనం ఢీకొందా అనే విషయాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.  
 

Advertisement
Advertisement