- అస్తవ్యస్తంగా చిన్నపిల్లల వార్డు
- ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే వార్డు మార్పు
- పట్టించుకునేవారు లేరు
- ఇదీ సర్వజనాస్పత్రి దుస్థితి
అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రి యాజమాన్యం చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే చిన్నపిల్లల వార్డును సూపరింటెండెంట్ బ్లాక్ పైభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన భవనంలోకి మార్చడం పలు విమర్శలకు దారితీస్తోంది. అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే వారు మరింత ఇబ్బందులకు గురయ్యేలా యాజమాన్యం వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వార్డులో గందరగోళ పరిస్థితి నెలకొది.
ప్రమాదకరంగా మెట్లు :
నూతన భవంలో అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంది. మెట్ల వద్ద గేట్ వేయకపోవడంతో పాటు గ్రిల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అలాంటి ముందస్తు జాగ్రతలు తీసుకోలేదు. ఎవరైనా రోగుల బంధువులు ఫోన్ మాట్లాడేటప్పుడు పొరపాటున జారి పడితే మూడో అంతస్తు నుంచి కిందకు పడే అవకాశం ఉంది. రాత్రివేళల్లో బయట వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉండేందుకు గేట్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
పరికాల అమరికేది? :
వార్డులో కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్లకు స్విచ్బోర్డు ఏర్పాటు చేయలేదు. ప్రమాదకరమైన కేసులకు వెంటిలేటర్ తప్పనిసరి. ఐసీయూలో ఏసీలు బిగించలేదు. తాగేందుకు నీటి సదుపాయం లేదు. దీన్నిబట్టిచూస్తే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పే యాజమాన్యం చిన్నపిల్లల వార్డులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు. శనివారం ఉదయం ఫర్హాన్ అనే చిన్నారి తప్పిపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి వారి తల్లిదండ్రులకు అందజేశారు. మూడో అంతస్తు కావడంలో వేడి అధికంగా వస్తుంటుంది. వాల్ రూఫింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
సిబ్బంది కొరత :
ప్రస్తుతం వార్డులో 200 మంది చిన్నారుల అడ్మిషన్లో ఉన్నారు. షిప్ట్కు ముగ్గురు స్టాఫ్ నర్సులను మాత్రమే నియమించారు. వాస్తవంగా వార్డులో నాలుగు యూనిట్లు ఉన్నాయి. యూనిట్కు ఇద్దరు స్టాఫ్ నర్సులైనా విధుల్లో ఉండాలి. ఇక సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని మాత్రమే కేటాయించారు. శనివారం ఉదయం ఫర్హాన్ అనే చిన్నారి తప్పిపోయాడు. దీంతో రోగుల అటెండర్లు పదుల సంఖ్యలో వార్డుల్లోనే తిష్టవేశారు. దీని ద్వారా క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
ముందుగానే చెప్పాం
యూనిట్లో అన్నీ సమకూర్చాకే వార్డును ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లా. యూనిట్లో చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.
పరికరాల ఏర్పాటుకు స్విచ్బోర్డు, రూఫింగ్, ఏసీలు బిగించాల్సి ఉంది. గైనిక్ వారి కోసం ఆత్రుతతో యూనిట్ మార్చాల్సి వచ్చింది.
- డాక్టర్ మల్లీశ్వరి, చిన్నపిల్లల వార్డు హెచ్ఓడీ
ప్రాణాలతో చెలగాటం
Published Sat, Sep 16 2017 9:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement